Home / Union minister Kishan Reddy
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నుంచి నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేయనున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు పాదయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు 114 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.
వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా ప్రధాని మోదీని అడ్డుకోలేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బేగంపేట విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మోడీకి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీకి స్వాగతం పలుకుతున్నారని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటనలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడం విచారకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపటిదినం ప్రధాని రామగుండం రానున్న క్రమంలో కిషన్ రెడ్డి భాజపా కార్యాలయంలో మీడియాతో సమావేశమైనారు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన గురించి ముందుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపామని కేంద్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి కిషన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో బిజీ బిజీగా గడిపారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నరసింహకొండలోని వేదగిర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
:ఫాంహౌజ్ ముఖ్యమంత్రి పాత ముచ్చటనే పదే పదే చెప్పారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న ఆవేదనతో, తీవ్ర అసహనంతో మీడియా ముందుకు వచ్చిన ఫాంహౌజ్ ముఖ్యమంత్రి పాత ముచ్చటనే పదే పదే చెప్పారు.
మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై పలివెల గ్రామంలో జరిగిన దాడిని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఖండించారు. ఓ పథకం ప్రకారం ఈటల పై దాడి చేశారని ఆయన మండిపడ్డారు.
భాజపా నేతలు దిక్కుమాలిన, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా అద్యక్షులు బండి సంజయ్ వి నకిలీ, మకిలీ మాటలని హరీష్ రావు విమర్శించారు. అబద్ధాలు చెప్పడం భాజపా డిఎన్ఏగా మరిందని ఆయన వ్యాఖ్యానించారు.
మొయినాబాద్ ఫాం హౌస్ కేంద్రంగా సాగిన తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ ఘటనలో సీఎం కేసిఆర్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ తో ఎమ్మెల్యేల కొనుగోలు స్కాంను బయటపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ లను, వార్డు మెంబర్లను సంతలో పశువులను కొనుగోలు చేసిన్నట్లుగా అధికార పార్టీ తెరాస ప్రజాప్రతినిధులను కొంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాతిపల్లి, ఊకొండి గ్రామంలో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచారంలో ఆయన సీఎం కేసిఆర్ పాలనపై ధ్వజమెత్తారు.