Last Updated:

Kishan Reddy: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన గురించి ముందుగానే కేసీఆర్ కు చెప్పాం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన గురించి ముందుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపామని కేంద్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Kishan Reddy: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన గురించి ముందుగానే కేసీఆర్ కు చెప్పాం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Hyderabad: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన గురించి ముందుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి స్వయంగా లేఖ రాసారు. రామగుండం ఎరువుల పరిశ్రమ శంకుస్థాపనకు వచ్చిన సీఎం ప్రారంభోత్సవానికి రావడానికి సాకులు చెబుతున్నారు అంటూ ఆయన విమర్శించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేరుతో పరిశ్రమ ప్రారంభం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే పనులు చేసి విఫలం అయ్యిందని ఆయన ఆరోపించారు.

ఈ నెల 11, 12 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన ఉంటుందన్నారు. తెలంగాణలో జాతీయ రహదారులకు భూమి పూజ, రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం, రైల్వే ప్రాజెక్ట్‌ల ప్రారంభం ఉంటాయన్నారు. తెలంగాణలో రూ.9596 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణలో 2014 నుండి ఇప్పటి వరకు జాతీయ రహదారులను 1 లక్ష 4 వేల కోట్లతో అభివృద్ధి చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రీజినల్ రింగు రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ఎంత త్వరగా పూర్తి చేస్తే రింగ్ రోడ్డు పనులు పూర్తవుతాయి. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే తెలంగాణ ముఖచిత్రం మారిపోతుంది. యూరియా బ్లాక్ మార్కెటింగ్ ను అడ్డుకునేందుకు నీమ్ కోటెడ్ యూరియాను ప్రవేశ పెట్టాము. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ప్రారంభం వల్ల తెలంగాణలో యూరియా కొరత లేకుండా పోయిందని అన్నారు.

యూరియా కోసం దేశంలో ఏ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాల్సిన అవసరం లేదు. యూరియా తయారీలో దేశం స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో యూరియా కొరత రాకుండా చూస్తున్నామన్నారు. రామగుండం పరిశ్రమ పునరుద్దరణ కోసం 6300 కోట్లు కేంద్రం ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. 300 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్, కార్మికుల కోసం టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా ఏర్పడిన పలు సమస్యలను అధిగమించి గత రెండు మూడు నెలల నుండి ట్రయల్ రన్ చేసి విజయవంతం అయ్యామన్నారు. 50 కేజీల బస్తా యూరియా తయారీ ఖర్చు 3 వేలు అయితే రైతులకు కేవలం 600 రూపాయలకు మాత్రమే ఇస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: