Home / Pakistan
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ను అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్ను అధికారికంగా అభ్యర్థించింది.సయీద్ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థనను పంపినట్లు వర్గాలు ధృవీకరించాయి.
పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునెర్ జిల్లాలో తొలిసారిగా హిందూ మహిళ డాక్టర్ సవీరా పర్కాశ్ దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనరల్ సీటుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు.
పాకిస్థాన్ లోని సింధ్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా మొదటి హిందూ మహిళ మనీషా రోపేటాను నియమించారు.రోపెటా పాకిస్తాన్ యొక్క పితృస్వామ్య అడ్డుగోడలను బద్దలు కొట్టడమే కాకుండా, 26 సంవత్సరాల వయస్సులో అధికార పదవిలో నియమితులైన మొదటి హిందూ మహిళగా కూడా రికార్డు సృష్టించారు.
ఇస్లామిక్ మిలిటెంట్లు వాయువ్య పాకిస్థాన్లోని పోలీస్ స్టేషన్పైకి పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కును ఢీకొట్టడంతో 25 మంది మరణించగా 16 మంది గాయపడ్డారు. ఆత్మాహుతి బాంబర్లు సెక్యూరిటీ కాంపౌండ్పైకి చొరబడి, ప్రాంగణంలోని పేలుడు పదార్థాలను పేల్చారు. భద్రతా సిబ్బందిపై కూడా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగాయి.
: జూలైలో తన ఫేస్బుక్ స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన రాజస్థాన్కు చెందిన అంజు రాఫెల్ అనే 34 ఏళ్ల మహిళ బుధవారం భారత్కు తిరిగి వచ్చింది.నేను సంతోషంగా ఉన్నాను. నాకు వేరే ఆలోచనలు లేవు అని అంజు తిరిగి వచ్చిన తర్వాత విలేకరులతో అన్నారు.
: పాకిస్తాన్లోని కరాచీలో రషీద్ మిన్హాస్ రోడ్లోని బహుళ అంతస్తుల షాపింగ్ మాల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది మరణించగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు, జియో న్యూస్ నివేదించింది. కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో మరణించిన వారి సంఖ్యను ధృవీకరించారు. భవనంలో వ్యక్తుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.
పాకిస్థాన్ పౌరులు లామినేషన్ పేపర్ కొరత కారణంగా కొత్త పాస్పోర్ట్లను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశం యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ & పాస్పోర్ట్స్ (DGI&P) ప్రకారం, పాస్పోర్ట్లలో ఉపయోగించే లామినేషన్ పేపర్ ఫ్రాన్స్ నుండి దిగుమతి అవుతుంది. ప్రస్తుతం దాని కొరత కారణంగా కొత్త పాస్పోర్ట్లు నిలిచిపోయాయి.
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తేదీని పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటన జారీ చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశంలోని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి
అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచిపెట్టకపోతే, పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రభుత్వం వారిని దశలవారీగా బహిష్కరించడం ప్రారంభిస్తుందని తాత్కాలిక అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ సోమవారం తెలిపారు. అక్రమ వలసదారుల తొలగింపునకు పాకిస్థాన్ ఈ నెల అక్టోబర్ 31 తేదీని డెడ్ లైన్ గా ప్రకటించింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాలుగు సంవత్సరాల ప్రవాసం తర్వాత శనివారం మధ్యాహ్నం స్వదేశానికి తిరిగి వచ్చారు. వచ్చే ఏడాది జనవరిలో పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరుతున్న నేపధ్యంలో షరీఫ్ స్వదేశానికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.