Home / latest ap news
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో ఇటీవల నాలుగు పులి పిల్లలను గుర్తించిన విషయం తెలిసిందే. పులి కూనలను తల్లి వద్దకు చేర్చటానికి అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముసలిమడుగు గ్రామం దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ లో పులికూనలను… తల్లి పులిని కలిపేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆపరేషన్ మదర్ టైగర్ 108 పేరుతో యత్నాలు చేస్తున్నారు.
Vijayawada Education News : సివిల్ సర్వీస్ కోచింగ్ ఇవ్వడం లో అనుభవం కలిగిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ, ఎస్.ఆర్.ఆర్ & సి.వీ.ఆర్ తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 7వ తేదిన విజయవాడలో ఎస్.ఆర్.ఆర్ & సి.వీ.ఆర్ కళాశాలలో తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బిఎస్ఎన్ దుర్గా ప్రసాద్, ఎస్ ఆర్ ఆర్ డిగ్రి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి పరస్పర అవగాహన ఒప్పందం పై సంతకం చేసారు. ఈ […]
Vijayawada Education News : సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ లో అపార అనుభవం కలిగిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయిన తక్షశిల ఐఏఎస్ అకాడమీ, విజయవాడలోని మేరిస్ స్టెల్లా కాలేజీతో కీలక పరస్పర అవగాహన ఒప్పందం (ఎం ఓ యూ)పై సంతకం చేసినట్లు తక్షశిల ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ బీఎస్ఎన్ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ సంధర్భంగా స్టెల్లా కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “మేరీస్ స్టెల్లా కళాశాలతో ఈ […]
జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో భాగంగా ఈరోజు విశాఖ ఏయూ గ్రౌండ్స్లో పలు నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించారు. అనంతరం ఆయన ముగింపు ప్రసంగం ఇచ్చారు. ఈ మేరకు జగన్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబదులే ధ్యేయంగా విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో రోజు ప్రారంభమైంది. నేడు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరగనున్నాయి. ఎంవోయూలపై కంపెనీలు ప్రభుత్వాధికారులు సంతకాలు చేయనున్నారు. సదస్సు వద్ద మాట్లాడిన మంత్రి అమర్నాథ్... సీఎం వైఎస్ జగన్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడని అన్నారు.
GIS 2023: విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్లో భాగంగా సీఎం జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. పర్యావరణ హితం.. పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, సాంకేతికత, వ్యవస్థాపకత ఈ నాలుగు రాష్ట్రానికి మూల స్తంభాల్లాంటివని అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 3, 4 తేదీల్లో జరగనున్న "గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్"కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు. సుమారు 2 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికలను సిద్దం చేశారు.
నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్, వరుణ్లకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సై పరీక్షలకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రిజల్ట్ ను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది.
తెలుగు దేశం పార్టీకి చెందిన ఇద్దర మాజీ మంత్రులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫోర్జరీ కేసులో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయం స్థానం అనుమతి ఇవ్వగా.. పేపర్ లీకేజ్ కేసులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్ కు కూడా సుప్రీం డిస్మిస్ చేసింది.