Published On:

IPL 2025: పంజాబ్ గ్రాండ్ విక్టరీ.. చెన్నై ఇంటికే!

IPL 2025: పంజాబ్ గ్రాండ్ విక్టరీ.. చెన్నై ఇంటికే!

Punjab Kings won The Match Against csk, IPL 2025 49th Match: ఐపీఎల్‌ 2025లో భాగంగా 18వ సీజన్‌లో చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య 49వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమి పాలైంది. దీంతో సొంత గడ్డపై హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది.

 

చెన్నై బ్యాటర్లలో సామ్ కరన్(88) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డెవాల్డ్ బ్రెవిస్ (32), రషీద్ (11), మాత్రే (7), రవీంద్ర జడేజా (17), దూబె (6), ధోనీ (11), దీపక్ హుడా (2) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో చాహల్ విజృంభించాడు. ఆయన 4 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, మార్కో యాన్సెన్ చెరో 2 వికెట్లు, ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్‌ చెరో వికెట్ తీశారు.

 

191 పరుగుల లక్ష్యఛేదనను పంజాబ్ బ్యాటర్లు సులువుగా బాదేశారు. పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలోనే ఛేదించింది. శ్రేయస్‌ అయ్యర్‌(72), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (54) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అదే విధంగా ఆర్య(23), వధేరా(5). శశాంక్(23), జోస్(6), జాన్నెస్(4) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో పతిరణ 2, ఖలీల్‌ అహ్మద్‌ 2, నూర్‌ అహ్మద్‌, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు.

 

ఇదిలా ఉండగా, ఈ ఓటమితో ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. దీంతో చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. కాగా, ఈ మ్యాచ్‌లో మా బ్యాటర్లు ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఫీల్డర్లు సైతం క్యాచ్‌ల విషయంలో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి ఉండాల్సిందని ధోనీ అన్నారు.