Home / పొలిటికల్ వార్తలు
ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకే పార్టీలో ఉండి కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
భారత్ జోడో యాత్రపై కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్ జోడో యాత్రపై అందరికీ సూచనలు చేశారు. ఢిల్లీలో సెప్టెంబర్ 4న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నామని తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బీహార్ కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు కేసీఆర్.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సానుభూతి పరులు రెచ్చిపోయారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్ పై అర్థరాత్రి దాడి చేశారు. ఫ్లెక్సీలను చించేయడంతో పాటు అక్కడి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పై దాడి
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని.. లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యంగా సినిమా రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పుడు ఆ ఉపఎన్నికే కమ్యూనిస్టుల్లో కల్లోలం రేపుతోందా.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టుగా కమ్యూనిస్టులు ‘ఎర్ర గులాబీ’లుగా మారారా..? అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు 30 ఏండ్ల పాటు మునుగోడు నియోజకవర్గాన్ని శాసించిన భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)కి ఏం అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి వైసీపీ విజయకేతనం ఎగరవేయాలంటే గెలుపు గుర్రాలదే ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఖరాఖండిగా చెప్పేశారు.
తెలంగాణలో తొలిసారి అధికారం అందుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకు దేనికైనా సిద్ధమేనంటోంది .... ఇందులో భాగంగా కేసీఆర్ కుమార్తెను లిక్కర్ స్కాంలో జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తోంది... అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు అండగా ఉన్న మీడియా, టాలీవుడ్.. అందర్నీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా 2016లో కెవిఐసి ఛైర్మన్ గా ఉన్నపుడు రూ. 1400 కోట్ల విలువైన నోట్లను మార్చుకోవాలని తన ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారని ఆప్ ఎమ్మెల్యే దురేగేశ్ పాఠక్ సోమవారం ఆరోపించారు. అతను కెవిఐసి ఛైర్మన్గా ఉన్నప్పుడు, నోట్ల రద్దు జరిగింది, అక్కడ పని చేస్తున్న క్యాషియర్ తాను బలవంతంగా నోట్ల మార్పిడికి పాల్పడ్డానని లిఖితపూర్వకంగా తెలిపాడు అతనిని సస్పెండ్ చేయడం దురదృష్టకరం.
సీఎం కేసీఆర్ సోమవారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజులు చేసిన సీఎం కేసీర్ కలెక్టర్ ని కుర్చీలో కూర్చోపెట్టారు. కలెక్టరేట్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.