Last Updated:

Minister Jaishankar: కెనడావి ఓటు బ్యాంకు రాజకీయాలు.. విదేశాంగ మంత్రి జై శంకర్

ఓటు బ్యాంకు రాజకీయాలే కాకుండా వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు కెనడా ఎందుకు స్థానం ఇస్తుందో అర్థం చేసుకోవడంలో భారత్ విఫలమైందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను వర్ణిస్తూ బ్రాంప్టన్‌లో జరిగిన కవాతు దృశ్యాలు వెలువడిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

Minister Jaishankar: కెనడావి ఓటు బ్యాంకు రాజకీయాలు.. విదేశాంగ మంత్రి జై శంకర్

 Minister Jaishankar: ఓటు బ్యాంకు రాజకీయాలే కాకుండా వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు కెనడా ఎందుకు స్థానం ఇస్తుందో అర్థం చేసుకోవడంలో భారత్ విఫలమైందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను వర్ణిస్తూ బ్రాంప్టన్‌లో జరిగిన కవాతు దృశ్యాలు వెలువడిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

అసంతృప్తిని తెలియజేసిన భారత్ ..( Minister Jaishankar)

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తానీ మద్దతుదారులు 5-కిమీల పొడవైన కవాతులో భాగంగా ఈ వీడియో విడుదలయింది. జూన్ 6న ఆపరేషన్ బ్లూ స్టార్ యొక్క 39వ వార్షికోత్సవానికి కొద్ది రోజుల ముందు, జూన్ 4న ఖలిస్తాన్ మద్దతుదారులు బ్రాంప్టన్‌లో ఈ కవాతు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై బుధవారం కెనడా ప్రభుత్వానికి భారత్ అధికారికంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఒట్టావాలోని భారత హైకమిషన్ గ్లోబల్ అఫైర్స్ కెనడాకి అధికారిక గమనికను పంపింది, ఈ సంఘటనను ఆమోదయోగ్యం కాదు అని వివరించింది. భారతదేశంలోని కెనడియన్ హైకమీషనర్ కామెరాన్ మాకే బ్రాంప్టన్ కార్యక్రమంలో ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరించడాన్ని ఖండించారు. కెనడాలో హింసను ద్వేషించడానికి లేదా కీర్తించడానికి స్థలం లేదని అన్నారు.

వీసా పత్రాలు నకిలీవని తేలిన వందలాది మంది భారతీయ విద్యార్థులపై కెనడా తీసుకున్న చర్య గురించి అడిగిన ప్రశ్నకు జైశంకర్, విదేశాంగ మంత్రిత్వ శాఖ కెనడా అధికారులతో చర్చలు జరుపుతోందని, విద్యార్థులు విశ్వాసంతో ప్రవర్తించారని వారిని తప్పు పట్టడం లేదని అన్నారు. మొదటి నుండి, మేము ఈ కేసును తీసుకున్నాము. మా ఉద్దేశ్యం ఏమిటంటే, విద్యార్థులు చిత్తశుద్ధితో చదువుకున్నారు. వారిని తప్పుదోవ పట్టించే వ్యక్తులు ఉంటే, దోషపూరిత పార్టీలపై చర్య తీసుకోవాలని జై శంకర్ అన్నారు.

కెనడా బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ దాదాపు 700 మంది భారతీయ విద్యార్థులకు వారి అడ్మిషన్ ఆఫర్ లెటర్‌లు నకిలీవని తేలిన తర్వాత వారికి బహిష్కరణ నోటీసులు జారీ చేసింది. వీరిలో ఎక్కువమంది పంజాబ్ కు చెందిన వారు. జలంధర్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ మరియు కౌన్సెలింగ్ సర్వీస్ నడుపుతున్న వ్యక్తి ఈ స్కామ్ లో ప్రధాన సూత్రధారి. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.