Last Updated:

Uttarkashi Tunnel Collapse: ఉత్తరకాశీ టన్నెల్: 31 మీటర్లు వర్టికల్ డ్రిల్లింగ్ చేసిన రెస్క్యూ సిబ్బంది

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా-బార్కోట్ సొరంగంలో నవంబర్ 12న కూలిపోయిన తర్వాత అందులో రెండు వారాలుగా చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తమ ప్రయత్నాలను వేగవంతం చేశాయి,  ఇందులో భాగంగా సొరంగం నుంచి కార్మికులను బయటకు తీయడానికి  ఆరు ప్రణాళికలను పరిశీలిస్తున్నారు.

Uttarkashi Tunnel Collapse: ఉత్తరకాశీ టన్నెల్: 31 మీటర్లు వర్టికల్ డ్రిల్లింగ్  చేసిన రెస్క్యూ సిబ్బంది

Uttarkashi Tunnel Collapse: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా-బార్కోట్ సొరంగంలో నవంబర్ 12న కూలిపోయిన తర్వాత అందులో రెండు వారాలుగా చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తమ ప్రయత్నాలను వేగవంతం చేశాయి,  ఇందులో భాగంగా సొరంగం నుంచి కార్మికులను బయటకు తీయడానికి  ఆరు ప్రణాళికలను పరిశీలిస్తున్నారు.

పైపు ద్వారా ఆహారం, మందులు..(Uttarkashi Tunnel Collapse)

ఆదివారం రెస్క్యూ సిబ్బంది సొరంగం పైన ఉన్న కొండపైకి నిలువుగా డ్రిల్లింగ్ ప్రారంభించారు. తాజా నివేదికల ప్రకారం దాదాపు 31 మీటర్ల లోతుకు చేరుకున్నారు. ఈ కొత్త విధానం ఇరుక్కుపోయిన వ్యక్తులను విడిపించడానికి పరిగణించబడుతున్న ఆరు వ్యూహాలలో భాగం. అధునాతన ఆగర్ డ్రిల్లింగ్ మెషిన్ చెడిపోయిన తర్వాత మాన్యువల్‌గా సొరంగం డ్రిల్లింగ్ ప్రారంభించడానికి ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌లో చేరింది. ఇప్పుడు సొరంగం నుంచి యంత్రాన్ని తొలగించారు.ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి గ్యాస్ కట్టర్‌కు అనుబంధంగా ప్లాస్మా కట్టర్‌ను తెప్పించారు.ఆరు అంగుళాల వెడల్పు గల పైపు ద్వారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలు పంపుతున్నారు. కార్మికుల కుటుంబాలు అప్పుడప్పుడు వారితో మాట్లాడేందుకు వీలుగా కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.