Last Updated:

Teachers Recruitment scam: టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌.. పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై దర్యాప్తునకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది.. రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు సీబీఐ నిఘాలో ఉన్నాయి.

Teachers Recruitment scam:  టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌..  పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

Teachers Recruitment scam: టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై దర్యాప్తునకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది.. రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు సీబీఐ నిఘాలో ఉన్నాయి.

మున్సిపాలిటీ రిక్రూట్ మెంట్లు..(Teachers Recruitment scam:)

ఈ కుంభకోణం కేవలం టీచర్ల రిక్రూట్‌మెంట్‌కే పరిమితం కాకుండా కంచరపరా, న్యూ బరాక్‌పూర్, కమర్‌హతి, టిటాగఢ్, బారానగర్, హలీసహర్, సౌత్ దమ్ డమ్ (ఎన్), డమ్‌తో సహా పలు మునిసిపాలిటీల ద్వారా అనేక ఇతర నియామకాలకు కూడా పాకిందని పత్రాల పరిశీలనలో వెల్లడైంది. రిక్రూట్‌మెంట్లలో లేబర్‌లు, స్వీపర్లు, క్లర్కులు, ప్యూన్‌లు, అంబులెన్స్ అటెండెంట్‌లు, పంప్ శానిటరీ అసిస్టెంట్‌లు, డైవర్లు, ఆపరేటర్లు మరియు హెల్పర్‌ల నియామకం జరిగింది.వివిధ మున్సిపాలిటీలు, జిల్లా ప్రాథమిక పాఠశాలల కౌన్సిళ్లకు సంబంధించిన కాంట్రాక్టులను ఒకే కంపెనీ కు ఇచ్చినట్లు విచారణలో తేలింది.

అయాన్ సిల్, కంపెనీ డైరెక్టర్ మరియు ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాజకీయ నాయకులతో సహా ఇతర ఉన్నతాధికారులు, ఇతర వ్యక్తులతో సహా తమలో తాము నేరపూరిత కుట్ర పన్నారు కుట్రకు అనుగుణంగా, అయాన్ సిల్ తన అధికారాన్ని మరియు బాధ్యతాయుతమైన పదవిని దుర్వినియోగం చేయడం ద్వారా ఒఎంఆర్ షీట్ల ముద్రణ, రూపకల్పన మరియు మూల్యాంకనం అభ్యర్థుల ఒంఎంఆర్ షీట్లను తారుమారు చేయడం ద్వారా అర్హత లేని అభ్యర్థుల అక్రమ నియామకాలను సులభతరం చేసారు.

కలకత్తా హైకోర్టు ఆదేశం..

పశ్చిమ బెంగాల్‌లోని వివిధ మున్సిపాలిటీల్లో అక్రమ నియామకాలు ఇప్పించేందుకు అభ్యర్థుల నుంచి రూ.200 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అయాన్‌సిల్‌ విచారణలో వెల్లడైంది.
రాష్ట్రంలోని వివిధ మునిసిపల్ సంస్థల్లో ఉద్యోగాల నియామకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని కలకత్తా హైకోర్టు ఏప్రిల్‌లో సీబీఐని ఆదేశించింది.మునిసిపల్ కార్పొరేషన్లలో రిక్రూట్‌మెంట్ స్కామ్ జరిగే అవకాశం ఉందని ఈడీ చెప్పడంతో కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. 2021లో ఉపాధ్యాయుల ఉద్యోగ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈడీ వీటికి సంబంధించిన ఆధారాలను కనుగొంది.