Published On:

Murshidabad Violence: హిందువులే టార్గెట్ గా వక్ఫ్ బోర్డు అల్లర్లు..!

Murshidabad Violence: హిందువులే టార్గెట్ గా వక్ఫ్ బోర్డు అల్లర్లు..!

Murshidabad Violence: వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో అల్లర్లు చెలరేగాయి. హిందువులను మాత్రమే టార్గెట్ గా చేసి దాడులు చేశారు. ఈ దుర్మార్గమైన అల్లర్లను బెంగాల్ అధికార పార్టీ నాయకుడైన మెహబూబ్ ఆలం  చేయించాడు. ఇతను స్థానిక కౌన్సిలర్. హైకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీలో ఈ నిజాలు వెళ్లడయ్యాయి. హిందువులపై దాడులు జరుగుతుండగా వాళ్లు వెళ్లి పోలీసులకు మొరపెట్టుకున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు హిందువులపై దాడులు చేస్తున్నారు కాబట్టి పోలీసులు పట్టించుకోలేదు.

 

హిందువుల ఆస్తులను విచక్షణారహితంగా దహనం చేశారు. దుఖానాల్లో దోపిడీ చేయడంతో పాటు మాల్స్ ను నాశనం చేశారు. అది చాలా సమయంపాటు కొనసాగింది. ఏప్రిల్ 11 శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఒక్కొక్కరూ పోగయి దాడులు చేశారు. బెట్ బోనా గ్రామంలో 113ఇళ్లు అత్యంత ఘోరంగా ద్వంసం చేశారు. దర్యాప్తు బృందంలో జాతీయ మానవహక్కుల కమిషన్, రాష్ట్ర న్యాయ సేవల సభ్యులు ఉన్నారు. ఈ నివేదికను ఈ రోజు హైకోర్టు బెంచ్ ముందు ఉంచారు.

ఇవి కూడా చదవండి: