Home / జాతీయం
: రాష్ట్రంలో గత బీజేపీ ప్రభుత్వం విధించిన గోవధ, పాఠశాలల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని రద్దు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని , కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్తో ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ గోహత్య లేదా హిజాబ్ మాత్రమే కాదు, బిజెపి ప్రభుత్వం విధించే ఏ నియమమైనా తిరోగమనంగా మరియు రాష్ట్ర ఆర్థిక మరియు సామాజిక వృద్ధికి వ్యతిరేకంగా ఉంటే అది పోతుందని అన్నారు.
:మణిపూర్లోని కుకీ గిరిజన సంఘం సభ్యులు ఈరోజు న్యూఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం ముందు నిరసన చేపట్టారు. ఈ ఉదయం ఆందోళనకారులు షా నివాసానికి చేరుకుని ఆయనను కలవాలని డిమాండ్ చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. హోంమంత్రి నివాసం వెలుపల పోలీసులు భద్రతను పెంచారు. కొద్దిమంది నిరసనకారులను షాను కలిసేందుకు అనుమతించారని సమాచారం.
జార్హండ్ లో న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ కు పెద్ద ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ నుండి వెళుతున్నప్పుడు భోజుడి స్టేషన్ సమీపంలో ట్రాక్టర్ రైల్వే ట్రాక్ మరియు గేట్ మధ్య ఇరుక్కుపోయింది. దీనిని గమనించిన రైలు డ్రైవర్ బ్రేకులు వేయడంతో రైలు ఆగిపోయి పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రభుత్వ ఉద్యోగలుకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు పూర్తిగా పెన్షన్ అందించనున్నట్టు ప్రకటించింది.
లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా భారత స్టార్ రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన తర్వాత విధుల్లో చేరారు. అయితే ఆందోళన మాత్రం కొనసాగిస్తామని తెలిపారు.
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించినట్లు భావించిన 35 ఏళ్ల వ్యక్తి, మృతదేహాలను ఉంచడానికి తాత్కాలికంగా ఉపయోగించిన పాఠశాల గదిలో సజీవంగా ఉన్నట్లు మంగళవారం బయటపడింది.
ఎయిరిండియా విమానం రష్యాలో ఎమెర్జెన్సీ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరిన విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా రష్యా కు మళ్లించారు. అక్కడ సురరక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గత శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు చేయడానికి ఒక బృందం మంగళవారం ప్రమాద స్థలానికి చేరుకుంది.మానవ తప్పిదాలు లేదా ప్రమాదానికి కారణమయ్యే ఉద్దేశపూర్వక ప్రయత్నాలతో సహా అన్ని కారణాలను పరిశీలిస్తుంది.
ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆన్లైన్ మత మార్పిడి రాకెట్ను భగ్నం చేసిన దీనిలో టీనేజర్లను తమ మతం మార్చుకోవడానికి వారిని ప్రలోభపెట్టడానికి ఆన్లైన్ గేమింగ్ యాప్ ద్వారా లక్ష్యంగా చేసుకున్నారు.ఈ పద్ధతిలో మతం మారిన నలుగురు మైనర్లు ఘజియాబాద్ నుండి ఇద్దరు మరియు ఫరీదాబాద్ మరియు చండీగఢ్ నుండి ఒక్కొక్కరిని ఇప్పటివరకు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్లోని ఒక ఏసీ కోచ్లోని ఏసీ యూనిట్ నుంచి పొగలు రావడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు, రైల్వే అధికారులు ఒడిశాలోని బ్రహ్మపూర్ స్టేషన్లో రైలును నిలిపివేసారు.