Home / జాతీయం
మంగళవారం సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్లోని ఒక ఏసీ కోచ్లోని ఏసీ యూనిట్ నుంచి పొగలు రావడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు, రైల్వే అధికారులు ఒడిశాలోని బ్రహ్మపూర్ స్టేషన్లో రైలును నిలిపివేసారు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) మంగళవారం డార్క్నెట్లో పనిచేస్తున్న పాన్-ఇండియా డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ను ఛేదించింది. 15,000 బ్లాట్ల ఎల్ఎస్డి లేదా లైసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్ సింథటిక్ కెమికల్ ఆధారిత హాలూసినోజెనిక్ డ్రగ్ ని స్వాధీనం చేసుకుంది
ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్లోని 40 మంది ప్రయాణికులు ఓవర్హెడ్ కేబుల్స్ తెగిపోవడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. ఒడిశాలోని బాలాసోర్లో యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన కోరమాండల్ రైలు బోగీలను ఢీకొనడంతో కేబుల్స్ తెగిపోయాయి.
గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందించే 'గృహ జ్యోతి' పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులు ఈ పథకాన్ని వాణిజ్యపరంగా పొందలేరని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. 'గృహ జ్యోతి'ని ప్రవేశపెట్టడంతో పాటు, జూన్ 11 నుండి మహిళలకు 'శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ భారత అగ్రశ్రేణి రెజ్లర్ల నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఢిల్లీ పోలీసు అధికారుల బృందం సోమవారం ఉత్తరప్రదేశ్లోని గోండాలోని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసాన్ని సందర్శించింది.
మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని జూన్ 10 వరకు పొడిగించాలని నిర్ణయించింది. మొదట మే 3న విధించిన నిషేధం ఇప్పుడు జూన్ 10 మధ్యాహ్నం 3 గంటల వరకు మరో ఐదు రోజుల పాటు అమలులో ఉంటుంది.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడిన 200 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, 101 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. జూన్ 2న బాలాసోర్లో రెండు ప్యాసింజర్ రైళ్లు మరియు ఒక సరుకు రవాణా రైలును ఢీకొన్న విధ్వంసక ప్రమాదంలో కనీసం 278 మంది ప్రాణాలు కోల్పోగా 1100 మందికి పైగా గాయపడ్డారు.
Kerala High Court: కేరళకు చెందిన మహిళ మోడల్ రెహనా ఫాతిమా(33)కు కేరళ హైకోర్ట్ ఊరటనిచ్చింది. తనపై ఉన్న కేసులను ఎత్తివేసింది. కొద్ది రోజుల క్రితం రెహానా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిన విమాన ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. విమాన ఛార్జీలు నియంత్రణలో ఉండాలని.. టికెట్ ధరల పెరుగదలపై పర్యవేక్షణ జరపాలని ఎయిర్ లైన్స్ సంస్థలను కేంద్రం సూచనలు చేసింది.
ఇండియన్ నేవీలోకి మరో సరికొత్త అస్త్రం చేరబోతోంది. పూర్తిగా దేశీయ టెక్నాలజీ ని ఉపయోగించి అభివృద్ధి చేసిన భారీ ‘టార్పిడో’ ను భారత నౌకాదళం మంగళవారం పరీక్షించింది. నీటిలోపల ఉన్న లక్ష్యాన్ని ఈ టార్పిడో దిగ్విజయంగా ఛేదించింది.