Last Updated:

Smoke From Train: సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు. ఒడిశాలో రైలు నిలిపివేత

మంగళవారం సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లోని ఒక ఏసీ కోచ్‌లోని ఏసీ యూనిట్ నుంచి పొగలు రావడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు, రైల్వే అధికారులు ఒడిశాలోని బ్రహ్మపూర్ స్టేషన్‌లో రైలును నిలిపివేసారు.

Smoke From Train: సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు. ఒడిశాలో రైలు నిలిపివేత

Smoke From Train: మంగళవారం సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లోని ఒక ఏసీ కోచ్‌లోని ఏసీ యూనిట్ నుంచి పొగలు రావడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు, రైల్వే అధికారులు ఒడిశాలోని బ్రహ్మపూర్ స్టేషన్‌లో రైలును నిలిపివేసారు.

కోచ్ మార్చాలని డిమాండ్ ..(Smoke From Train)

రైలు బి-5 కోచ్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు బ్రహ్మపూర్ స్టేషన్‌లో దిగారు.వెంటనే పొగలను అదుపు చేసినప్పటికీ భయాందోళనకు గురైన ప్రయాణికులు కోచ్‌లో ప్రయాణించడానికి నిరాకరించారు. కోచ్‌ను మార్చాలని డిమాండ్‌ చేశారు.పొగ అదుపులోకి వచ్చిన తర్వాత రైలు స్టేషన్‌ నుంచి బయలుదేరింది.సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లోని బ్రహ్మపూర్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న కోచ్ నెం. B-5లో చిన్న విద్యుత్ సమస్య సంభవించినట్లు నివేదించబడింది. విధుల్లో ఉన్న సిబ్బంది వెంటనే సమస్యను పరిష్కరించారు,” అని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) అధికారి తెలిపారు.

మరోవైపు కేరళలో, ఇంటర్-సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని సోమవారం కోచ్‌కు నిప్పంటించే ప్రయత్నం చేశాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం సాయంత్రం 4.15 గంటలకు కన్నూర్-ఎర్నాకుళం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సంఘటన జరిగిందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు రైల్వే పోలీసు అధికారులు ధృవీకరించారు. అయితే, ఆ వ్యక్తి ఎవరి కస్టడీలో ఉన్నారనే విషయాన్ని అధికారులు ఎవరూ పేర్కొనలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. వ్యక్తి మానసిక స్థితి సరిగా లేనట్లు కనిపించాడు” అని రైల్వే అధికారి తెలిపారు