Home / జాతీయం
గుజరాత్ లోని తాపీ జిల్లాలో మాయాపూర్, దేగామ గ్రామాలను కలుపుతూ మింధోలా నదిపై నిర్మించిన వంతెన బుధవారం కూలిపోయింది. ఇంకా ప్రారంభోత్సవం జరగకుండానే ఈ వంతెన కూలిపోవడం గమనార్హం. 2021లో రూ.2 కోట్లతో ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణం ఇప్పుడు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది. దీని నిర్మాణ సమయంలో నాసిరకం వస్తువులు వాడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలపై ఆందోళనను తెలియజేస్తూ జమియత్ ఉలమా-ఇ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ అసద్ మదానీ మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి లేఖ రాశారు.
ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడం రాష్ట్రంలోని అధికార డిఎంకె, బిజెపి మరియు ఎఐడిఎంకె, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది మంత్రికి ఛాతి నొప్పి రావడంతో బుధవారం ఉదయం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. మనీలాండరింగ్ కేసులో బాలాజీని అరెస్ట్ చేశారు.
మణిపూర్లో తాజాగా జరిగిన ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో పదిమంది గాయపడ్డారు. మైటీల ప్రాబల్యం ఉన్న ఇంఫాల్ తూర్పు జిల్లా మరియు గిరిజనులు అధికంగా ఉండే కాంగ్పోక్పి జిల్లా సరిహద్దుల వెంబడి కాల్పులు జరిగాయి.హింసలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఎనిమిది వేల కోట్ల రూపాయల బ్యాంకు ఫ్రాడ్ కేసులో డక్కన్ క్రానికల్ సంస్థకి చెందిన 14 ఆస్తులని ఈడీ అధికారులు అటాచ్ చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులోని ఆస్తులని ఈడీ అధికారులు సీజ్ చేశారు. కెనరా, ఐడిబిఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
ప్రధాని నరేంద్ర మోదీ 70 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఫెయిర్ కింద వీరిని ఎంపిక చేశారు. నేటి ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన దాదాపు 70వేల మందికి ప్రధాని అపాయింట్మెంట్ లెటర్లను అందించారు.
ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లాలో టాటా స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మేరమాండల్ ప్రాంతంలో టాటా స్టీల్ కు చెందిన ‘బ్లాస్ట్ ఫర్నేస్ పవర్ ప్లాంట్’లో ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయినట్టు తెలుస్తోంది.
: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై భారతీయ అగ్రశ్రేణి రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన సమాచారం, సీసీటీవీ ఫుటేజీల కోసం ఐదు దేశాల రెజ్లింగ్ సమాఖ్యలకు ఢిల్లీ పోలీసులు నోటీసు పంపారు
మహిళా స్నేహితురాలిని కాక్పిట్లోకి ఆహ్వానించినందుకు ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లను సస్పెండ్ చేశారు. కాక్పిట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించిన ఒక నెల తర్వాత ఇది జరిగింది.
: తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. మంత్రికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఆర్థిక అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి