Last Updated:

CM Shivraj Singh Chouhan: మూత్ర విసర్జన బాధితుడి పాదాలు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఒక వ్యక్తి మూత్ర విసర్జన బాధితుడయిన గిరిజన కూలీ దశమత్ రావత్ ని కలిశారు. తన అధికారిక నివాసంలో అతడి పాదాలను కడిగారు.సిద్ధి జిల్లాలో కార్మికుడిపై మూత్ర విసర్జన చేస్తూ కెమెరాలో చిక్కుకున్న ప్రవేశ్ శుక్లానుబుధవారం అరెస్ట్ చేసి అతడి ఆస్తిని బుల్డోజర్ తో కూల్చేసిన విషయం తెలిసిందే.

CM Shivraj Singh Chouhan: మూత్ర విసర్జన బాధితుడి పాదాలు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్

CM Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఒక వ్యక్తి మూత్ర విసర్జన బాధితుడయిన గిరిజన కూలీ దశమత్ రావత్ ని కలిశారు. తన అధికారిక నివాసంలో అతడి పాదాలను కడిగారు.సిద్ధి జిల్లాలో కార్మికుడిపై మూత్ర విసర్జన చేస్తూ కెమెరాలో చిక్కుకున్న ప్రవేశ్ శుక్లానుబుధవారం అరెస్ట్ చేసి అతడి ఆస్తిని బుల్డోజర్ తో కూల్చేసిన విషయం తెలిసిందే.

పేదలకు గౌరవం, భద్రత ముఖ్యం..(CM Shivraj Singh Chouhan)

ఘటనపై దశమత్ రావత్‌కు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు. అతను కార్మికుడి పాదాలను కడుగుతున్న చిత్రాలను శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారుపేదవాడే దేవుడు మరియు ప్రజలే దేవుడు” అని చెప్పాడు.నాకు పేదలే దేవుడు, ప్రజలే నాకు దేవుళ్లలాంటి వారు. ప్రజలకు సేవ చేయడం భగవంతుడిని ఆరాధించడంతో సమానం. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడని నమ్ముతాం. దశమత్ రావత్‌ కు జరిగిన అమానవీయ సంఘటన నన్ను బాధించింది. పేదలకు గౌరవం మరియు భద్రత ముఖ్యమని అన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ దశమత్ రావత్‌కు పూలమాల వేసి, శాలువా కప్పారు. అతడిని భోపాల్‌లోని స్మార్ట్ సిటీ పార్క్‌కు మొక్కలు నాటేందుకు తీసుకెళ్లారు. రావత్ ను కలవడానికి ముందు, ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వీడియో చూసిన తన హృదయం చాలా కలత చెందిందని మరియు బాధతో నిండిపోయిందని అన్నారు.