Last Updated:

Rats saved Accused: గంజాయి కేసులో నిందితులను రక్షించిన ఎలుకలు.. ఎలాగో తెలుసా?

స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎలుకలు తిన్నాయని పోలీసులు పేర్కొనడంతో 22 కిలోల గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలివి.

Rats saved Accused: గంజాయి కేసులో నిందితులను రక్షించిన ఎలుకలు..  ఎలాగో తెలుసా?

Rats saved Accused: స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎలుకలు తిన్నాయని పోలీసులు పేర్కొనడంతో 22 కిలోల గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలివి.

నిర్దోషులుగా విడుదల..(Rats saved Accused)

రాజగోపాల్ మరియు నాగేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులను 2020లో చెన్నైలో మెరీనా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు రికార్డుల ప్రకారం, వారి వద్ద నుండి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.వీరి కేసును చెన్నైలోని ప్రత్యేక నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కోర్టు విచారించింది. అయితే వీరిద్దరి నుంచి స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను కోర్టులో హాజరుపరచడంలో పోలీసులు విఫలమయ్యారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 50 గ్రాముల గంజాయిని పోలీసులు సమర్పించగా, మరో 50 గ్రాములను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం.మిగిలిన 21.9 కిలోల గంజాయికి సంబంధించి కోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఎలుకలు తిన్నాయని పోలీసులు తెలిపారు.ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు విఫలం కావడంతో, అరెస్టు చేసిన నిందితులను సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది