Home / Aam Aadmi Party
Atishi Marlena: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఆప్ సీనియర్ నేత, మాజీ సీఎం అతిశి నియోజకవర్గమైన కల్కాజీలోని గోవింద్ పురి జుగ్గి క్లస్టర్ లో అక్రమంగా నిర్మించిన 1200కు పైగా గుడిసెలను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు. కాగా ప్రభుత్వ తీరుపై ఆప్ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ పేదల వ్యతిరేక ప్రభుత్వమని మాజీ సీఎం అతిశి ఆరోపించారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలు కూల్చివేసినట్టు […]
ACB issued summons to Aam Aadmi Party Leaders: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కు ఢిల్లీ అవినీతి నిరోధకశాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలోని క్లాస్ రూమ్ ల నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6న జైన్, జూన్ 9న సిసోడియా హాజరుకావాలని ఏసీబీ తన సమన్లలో పేర్కొంది. ఏప్రిల్ 30న ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సమన్లు ఇచ్చారు. […]
Former Delhi CM Atishi : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా భర్త మనీశ్ గుప్తాపై ఆప్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి అతిశీ సంచలన ఆరోపణలు చేశారు. మనీశ్ గుప్తా అనధికారికంగా ఢిల్లీ సర్కారును నడుపుతున్నారని ఆరోపించారు. మనీశ్ గుప్తా పలువురు అధికారులతో సమావేశమైన ఫొటోను అతిశీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.. ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్త మనీశ్ గుప్తా పలువురు అధికారులతో సమావేశమయ్యారని తెలిపారు. గ్రామాల్లో సర్పంచ్గా మహిళ ఎన్నికైతే […]
Punjab Assembly : పంజాబ్ ప్రభుత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి నిరసన సెగ తగిలింది. ఇవాళ శాసన సభ సాక్షిగా ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సర్కారు పనితీరుపై అసంతృప్తి గళం వినిపించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని విమర్శించారు. తన నియోజకవర్గంలో ప్రజలు పాకిస్థాన్లో ఉన్నట్టుగా ఫీలవుతున్నారని మోగా జిల్లాలోని ధరమ్కోట్ నియోజకవర్గ శాసన సభ్యుడు దేవిందర్ జీత్ సింగ్ వ్యాఖ్యానించారు. అప్గ్రేడ్ చేయడంలేదు.. మోగా జిల్లాలోని […]
ప్రభుత్వ ప్రకటనల రూపంలో రాజకీయ ప్రకటనల కోసం రూ.163.62 కోట్లు ఖర్చుపెట్టినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి గురువారం నోటీసులు అందాయి. ఈమొత్తాన్ని 10 రోజుల్లోగా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రకటనలుగా రాజకీయ ప్రకటనలను ప్రచురించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రూ.97 కోట్లను రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు బీజేపీ తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను కొనుగోలు చేసేందకు ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపించారు.
AAP : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. సాధారణంగా ఏదైనా పార్టీ 4 రాష్ట్రాల్లో 6శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కుతుంది.
ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ను ఏడోసారి బీజేపీ కైవశం చేసుకుంది. ఈ విజయం కూడ మామూలుగా లేదు.. ఏకపక్షంగా సాగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు సీరియస్ గా సిద్దంకాకపోవడం, ఆప్ ఆశించిన మేర పట్టణ ఓట్లను సాధించలేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తి కాగా... పలు ఎగ్జిట్ పోల్స్ లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందనే వెల్లడించాయి.