Chandrababu: నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు.. గంగమ్మ తల్లి జాతరకు హాజరు

Chittoor: ఏపీ సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. కుప్పంలో జరిగే ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కుప్పం పర్యటన ముగించుకుని సాయంత్రానికి అమరావతికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
కాగా కొద్దిరోజులుగా తిరుపతి శ్రీ గంగమాంబ ఆలయ ప్రధాన దేవత ప్రసన్న గంగమ్మ జాతర సాగుతోంది. దీంతో అమ్మవారికి సాంప్రదాయ పట్టు వస్త్రాలు సమర్పించడానికి సీఎం చంద్రబాబు దంపతులు, కుటుంబ సభ్యులు ఆలయానికి రానున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పార్టీ నేతలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు ఎర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటించే ప్రదేశాల్లో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.