Home / తప్పక చదవాలి
అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. దిగ్గజ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ దుర్మార్గాల చిట్టాను న్యూయార్క్ కోర్టు తాజాగా బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసే ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం లక్షద్వీప్లో స్నార్కెలింగ్ చిత్రాలను పంచుకున్నారు . లక్షద్వీప్ సహజమైన బీచ్ల వెంట ఉదయాన్నే నడకలు స్వచ్ఛమైన ఆనందాన్ని కలిగించే క్షణాలు అని అన్నారు. లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోదీ రూ.1,150 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
తెలంగాణలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె ప్రతిపాదనని విరమించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2773 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. పెరిగిన ప్రయాణీకులతో డీజిల్ ఖర్చు ఎక్కువైందని అద్దె బస్సు ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నాయకుడు జితేంద్ర అవద్ బుధవారం రాముడు 'మాంసాహార' అంటూ చేసిన వ్యాఖ్యలతో వివాదం రేగింది.అతని ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడి వైరల్ గా మారింది.మరోవైపు బీజేపీ అవద్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. అతనిపై ఫిర్యాదు చేసింది.
వైఎస్ షర్మిల బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. బేగంపేట విమానాశ్రయం నుంచి నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ను సీఎం జగన్ పరామర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వెళుతోంది. యుద్ధం మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్కు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరౌరీని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అరూరి అంగరక్షకులు కూడా మరణించారని వెల్లడించారు.
ఇరాన్లో బుధవారం జంట పేలుళ్ల కారణంగా 73 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. 2020 యుఎస్ డ్రోన్ దాడిలో మరణించిన టాప్ కమాండర్ ఖాసిమ్ సులేమాని సంస్మరణ వేడుకలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ అత్యవసర సేవల ప్రతినిధి బాబాక్ యెక్తపరాస్ట్ 73 మంది మరణించారని, 170 మంది గాయపడ్డారని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. వివిధ నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ రెడ్డి తెలుగుదేశంలో చేరారు. ద్వారకానాథ రెడ్డి బంధువులు విజయసాయి రెడ్డి, సునందరెడ్డి మినహా ఇతర కుటుంబ సభ్యులు తెలుగుదేశంలో చేరారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు టీడీపీలో చేరారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కాకినాడలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద పెంచిన పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం రంగరాయ వైద్య కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు