Last Updated:

Woman Sarpanch: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్‌ సంచలన ఆరోపణలు

Woman Sarpanch: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయం వెడేక్కుతోంది. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఓ మహిళ సర్పంచ్ ఆరోపణలతో పెను ప్రకంపనలు మొదలయ్యాయి.

Woman Sarpanch: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్‌ సంచలన ఆరోపణలు

Woman Sarpanch: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయం వెడేక్కుతోంది. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఓ మహిళ సర్పంచ్ ఆరోపణలతో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. తన కోరిక తీర్చాలని వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

మహిళ సర్పంచ్ సంచలన ఆరోపణలు.. (Woman Sarpanch)

మాజీ ఉప ముఖ్యమంత్రి.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాల్లో చిక్కుకున్నారు. తన కోరిత తీర్చాలంటూ వేధిస్తున్నాడని జానకీపురం మహిళ సర్పంచ్‌ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. లైంగికంగా వేధిస్తున్నాడని ధ్వజమెత్తారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్‌ చేసి బయటకు రమ్మంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే తనతో మాట్లాడిన కాల్‌ రికార్డింగ్స్ ఉన్నాయని తెలిపారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు.

ఎవరి ప్రమేయం లేదు..

సంచలన ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్య. తన వెనక ఎవరు లేరని స్పష్టం చేశారు. వేధింపులు భరించలేకనే ఇలా మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం లేదన్నారు. నీ మీద కోరికతోనే పార్టీ టికెట్‌ ఇచ్చానని ఎమ్మెల్యే పలు సందర్భాల్లో అన్నారని నవ్య ఆరోపించారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారని.. హగ్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తారని మండిపడ్డారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.

ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని అందుకే గతంలో జరిగిన విధంగా తనపై కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషించి తనను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.