Last Updated:

CM Revanth Reddy in Warangal: వరంగల్‌ను హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

CM Revanth Reddy in Warangal: వరంగల్‌ను హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy in Warangal: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వరంగల్‌ను హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కనెక్టివిటీ పెంపుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకమైన ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు అవసరమైన నిధులకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని కోరారు.ప్రతిపాదిత ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఒక జాతీయ రహదారిని మరో జాతీయ రహదారితో అనుసంధానించేలా అభివృద్ధి చేయాలన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డును టెక్స్‌టైల్‌ పార్క్‌కు అనుసంధానం చేసేలా రోడ్డు అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు.

మాస్టర్ ప్లాన్ రూపొందించాలి..(CM Revanth Reddy in Warangal)

వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ -2050 రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని, తాగునీటి పైపులైన్లు వేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నీటి వనరులను కాపాడేందుకు కాలువ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వరంగల్‌లో డంపింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వ్యర్థాల నిర్వహణ పరిష్కారాల ఆవశ్యకతను గుర్తు చేసారు. వరంగల్ నగర అభివృద్ధిపై ప్రతి 20 రోజులకోసారి ఇంచార్జి మంత్రి సమీక్ష నిర్వహించాలని రేవంత్ రెడ్డి కోరారు.

అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. . వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా టెక్స్‌టైల్ పార్క్‌లో మొక్కలు నాటారు. ప్రభుత్వ మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. సీఎం పర్యటనలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, బలరాంనాయక్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: