Last Updated:

Pawan kalyan: దోచుకున్న ఆస్తులు స్వాహా చేసేందుకే భూరక్ష చట్టం తెచ్చారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. న్యాయవాదులు సమగ్ర భూరక్ష చట్టంపై పవన్‌ మద్దతు కోరారు. సమావేశంలో విజయవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ న్యాయవాదుల ఆందోళనకు జనసేన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.

Pawan kalyan:  దోచుకున్న ఆస్తులు స్వాహా చేసేందుకే  భూరక్ష చట్టం తెచ్చారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. న్యాయవాదులు సమగ్ర భూరక్ష చట్టంపై పవన్‌ మద్దతు కోరారు. సమావేశంలో విజయవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ న్యాయవాదుల ఆందోళనకు జనసేన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.

ప్రాథమిక హక్కుల ఉల్లంఘన..(Pawan kalyan)

అనంతరం మీడియాతో మాట్లాడుతూ నా భూమిలో నీకు హక్కేంటి అనేది ఇక్కడ ప్రధాన సమస్య అని, ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పవన్ చెప్పారు. విశాఖలో దోచుకున్న ఆస్తులు స్వాహా చేసేందుకే ఈ చట్టం తెచ్చారా? అని ప్రశ్నించారు. ఈ చట్టం వల్ల రెవెన్యూ అధికారుల సాయంతో ఆస్తులు దోచుకోవచ్చని, కోర్టు నుంచి న్యాయరక్షణ పొందవచ్చనే దాన్ని ఈ చట్టంలో తీసేశారని పవన్ అన్నారు.సగటు మనిషికి సులువుగా చెప్పేందుకు ఈ చట్టాన్ని మరింత అధ్యయనం చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఈ చట్టం రాజ్యాంగానికి, ప్రజలకు వ్యతిరేకమని అందరికీ అర్దం అయ్యేలా చెప్పేందుకు తనకు కాస్త సమయం కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు.