Home / Mangalagiri
మంగళగికి జనసేన పార్టీ కార్యాలయానికి బుధవారం పలువరు నేతలు క్యూ కట్టారు. పవన్ కళ్యాణ్ తో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సమావేశమయ్యారు. జనసేన పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మంచిరోజు చూసుకుని పార్టీలో చేరుతారని సమాచారం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కలిశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. న్యాయవాదులు సమగ్ర భూరక్ష చట్టంపై పవన్ మద్దతు కోరారు. సమావేశంలో విజయవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ న్యాయవాదుల ఆందోళనకు జనసేన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఫించన్లలో కోత విధించి రూ.291 కోట్లు కాజేసారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గురువారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెలరోజుల్లో 19 వేలమంది ఫించన్లకు కోత పెట్టారని ఆయన చెప్పారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ జరిగింది.టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు.
జగన్కు చెబుతున్నా.. నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. గురువారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషన్కు రెడీ.. జైలుకు వెళ్లేందుకు.. దెబ్బలు తినేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసారు.
సెక్షన్ 30 యాక్ట్ని ప్రభుత్వం అమలు చేయడంతో యాత్ర ఏ విధంగా నిర్వహించాలన్నఅంశంపై చర్చించనున్నారు.రేపు జనసేన పార్టీ కార్యాలయంలో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తరువాత పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శాంతి హోమం ప్రారంభం అవుతుంది.
Pawan kalyan: ఏపీలో డిసెంబరులో ఎన్నికలు రావొచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అదే జరిగితే.. జూలై నుంచి ప్రచారం చేస్తానని అన్నారు.
మంగళగిరి వేదికగా బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు జనసేనాధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆర్మీ టైప్ ఫ్యాంట్ బ్లాక్ టీ షర్ట్ వేసుకుని వీర సైనికుడిలా ఇచ్చి ఎంట్రీకి గన్నవరం ఎయిర్ పోర్ట్ ప్రాంగణం పవన్ స్లోగన్స్ తో మారుమోగిపోయింది.
పవన్ కళ్యాణ్ ఏపీలో వారాహి టూర్ కి సిద్ధమయ్యారు. మంగళగిరి వేదికగా బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ప్రజలు అంగీకరిస్తేనే తాను ముఖ్యమంత్రిని అవుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిగిలో జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.