Last Updated:

PM Modi: రైతు అభివృద్ది చెందితేనే దేశం పురోగమిస్తుంది.. ప్రధాని మోదీ

దేశం వేగంగా అభివృద్ది చెందడానికి 'సబ్కా ప్రయాస్' పునాది అని ప్రధాని మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సూరత్ లో జరుగుతున్న నేచురల్ ఫార్మింగ్ కాన్‌క్లేవ్‌ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, 75 సంవత్సరాల స్వాతంత్ర్యం సందర్భంగా, దేశం వివిధ లక్ష్యాల కోసం పని చేయడం ప్రారంభించిందన్నారు.

PM Modi: రైతు అభివృద్ది చెందితేనే దేశం పురోగమిస్తుంది..  ప్రధాని మోదీ

New Delhi: దేశం వేగంగా అభివృద్ది చెందడానికి ‘సబ్కా ప్రయాస్’ పునాది అని ప్రధాని మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సూరత్ లో జరుగుతున్న నేచురల్ ఫార్మింగ్ కాన్‌క్లేవ్‌ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, 75 సంవత్సరాల స్వాతంత్ర్యం సందర్భంగా, దేశం వివిధ లక్ష్యాల కోసం పని చేయడం ప్రారంభించిందన్నారు. ఇది రాబోయే కాలంలో పెద్ద మార్పులకు పునాదిగా మారుతుందని అన్నారు.

భారతదేశం ప్రకృతి మరియు సంస్కృతి ద్వారా వ్యవసాయ ఆధారిత దేశం. మన జీవితం, ఆరోగ్యం మరియు మన సమాజం మన వ్యవసాయ వ్యవస్థకు ఆధారం. రైతు అభివృద్ధి చెందితే మన వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. మన దేశం పురోగమిస్తుందని  మోదీ అన్నారు.

పరంపరగత్ కృషి వికాస్ యోజన  గురించి ప్రస్తావిస్తూ ఇండియన్ అగ్రికల్చరల్ సిస్టమ్స్ ప్రోగ్రామ్‌ల ద్వారా రైతులకు వనరులు, సౌకర్యాలు మరియు తోడ్పాటును అందిస్తున్నామని ప్రధాని అన్నారు. ఈ పథకం కింద దేశంలో 30,000 క్లస్టర్లను ఏర్పాటు చేశామని, లక్షలాది మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారని మోదీ తెలిపారు.

ఇవి కూడా చదవండి: