Home / తాజా వార్తలు
2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతులు రికార్డు బద్దలు కొట్టాయని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 776.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఏపీలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసారు . బుధవారం జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట సమీపంలో బస్సు, టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు.
పాకిస్తాన్ను ప్రస్తుతం దుబాయి ప్రాపర్టీ లీక్స్ నిలువునా వణికిస్తోంది. దుబాయిలో అత్యంత ఖరీదైన విల్లాలు పాకిస్తాన్కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, మిలిటరీ, బ్యాంకర్లు, బ్యూరక్రసీకి చెందిన వారు కొనుగోలు చేస్తున్నారు.
మే 18 కోసం యావత్ క్రికెట్ లోకం ఎదురుచూస్తోంది. ఆ రోజు బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇది నాకౌట్ మ్యాచ్లా మారిపోయింది. ఇరు జట్లకు కీలకం ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అందుకే ఇరు జట్ల అభిమానులు రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు
ఏపీలో బెట్టింగ్ జోరు అందుకుంది .ఒక వైపు ఐపీఎల్ బెట్టింగ్ లు నడుస్తున్నాయి .తాజాగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగులు ఊపు అందుకున్నాయి .సహజంగా అగ్రనేతలు పోటీ చేసే చోట్ల బెట్టింగులు ఉంటాయి .కానీ ఈ సారి అగ్రనేతలు పోటీ చేసే స్థానాల్లో బెట్టింగులు జరగడంలేదు
పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. పీఓకే భారత్లో భాగమే అని మరోమారు నొక్కి చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్ భారత్లో అంతర్బాగమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ హింసాత్మక ఘటనలకు దారితీయడానికి ప్రధాన కారణం పెరిగిపోతున్న ద్రవ్యోల్బణమే అని అన్నారు.
న్యూస్క్లిక్ వ్యవస్థాపక ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ అరెస్టు చెల్లుబాటు కాదని.. తక్షణమే విడుదల చేయాలని బుధవారం నాడు సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం జడ్జిలు బీఆర్ గవాయి, సందీప్ మెహతాలతో కూడిన న్యూస్ క్లిక్ ఎడిటర్ అరెస్టుకు సంబంధించి రిమాండ్ కాపీ తమకు అందజేయలేదని, కాబట్టి ప్రబీర్ పురకాయస్థ అరెస్టు చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది.
ఒకప్పుడు అల్లర్లు అంటే బిహార్, యూపీ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఏపీలో అంతకుమించి విధ్వంసంకాండ జరుగుతోంది. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, ఆళ్లగడ్డ, ఏలూరులో టీడీపీ, వైసీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులు, కత్తులు, రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు. తలలు పగిలినా, కాళ్లు చేతులు విరిగినా తగ్గట్లేదు.
తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో షోలు నిలిపివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి.గత కొంతకాలంగా ధియేటర్ల కలెక్షన్లు తగ్గుముఖం పట్టడంతో వారికి ఆర్దిక ఇబ్బందులు తలెత్తడంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. పరిస్దితుల్లో మార్పు వస్తే మరలా షోలు కొనసాగిస్తామని చెబుతున్నారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవదహనం అయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరు -చిలకలూరిపేట హైవేపై.. టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొనడంతో.. క్షణాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడ్డాయి.