Home / ప్రాంతీయం
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ముస్లిం రిజ్వేషన్లను రద్దు చేస్తామని కేంద్రహోంమంత్రి అమిత్ షా గురువారం నాడు తెలంగాణలోని సిద్దిపేట బహిరంగ సభలో మాట్లాడుతూ హామీ ఇచ్చారు. దీనికి బదులుగా ఎస్సీ, ఎస్టిలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల వారికి లబ్ధి చేకూరుస్తామన్నారు.
ఏపీ సీఎం జగన్ పై అయన సోదరి ,వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు .జగన్ తలపై బ్యాండేజి తీ సివేస్తేనే మంచిదని సలహా ఇచ్చారు .గాలి ఆడకుండా ఎక్కువ కాలం ఉంటే గాయం మానదని అన్నారు .అలాగే ఉంచుకుంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని ఒక డాక్టర్ గా చెబుతున్నానని అన్నారు .పులివెందుల లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు.
అవినీతి మయమైన వైసీపీ ని పాతాళానికి తొక్కేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు .గురువారం సాయంత్రం రాజం పేట జిల్లా రాజం పేటలో కూటమి ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అంటూ నినాదాలు ఇచ్చారు .మన రాష్ట్రం,మన నేల ,మన ప్రజలు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల కూడదని కూటమి కట్టామని అన్నారు .
బీజేపీపై నయవంచన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది. గురు వారం గాంధీభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ ఈ ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 40కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రారంభించామని..గొప్పులు చెప్పే బీజేపీ ఏ ఒక్క పేదవారి ఖాతాలో చిల్లిగవ్వ కూడా వేయకుండా మోసం చేసిందని అన్నారు .
పీఎల్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉప్పల్ హెచ్ సి ఏ క్రికెట్ స్టేడియం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది .ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి .. ఆధ్వర్యంలో ధర్నాచేసారు.
తెలంగాణ లో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణం మొదలు పెట్టిన యాదాద్రి ధర్మల్ విద్యుత్కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి మంజూరు చేసింది .ఈ ప్రాజెక్టు వలన ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు విమర్శించడం గమనార్హం .దీని వలన లాభం కంటే నస్టమే ఎక్కువని అనవసరంగా కేసీఆర్ ఈ ప్రాజెక్టు ప్రారంభించారని చెబుతోంది.
పతినే ప్రత్యక్ష దైవంగా భావించిన భార్య భర్త చనిపోయిన తర్వాత గుడి కట్టిన సంఘటన ఆసక్తిగా మారింది .మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి ,సోమ్లాతండాకు చెందిన బానోతు హరిబాబు, కల్యాణి దంపతలు. వీరికి 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది . పిల్లలు కలగ లేదు.
ఏపీ సీఎం జగన్ కు తన చిన్నమ్మ ,వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు .ఇప్పటి వరుకు వివేకానంద రెడ్డి హత్య కు సంబంధించి అయన సతీమణి సౌభాగ్యమ్మ ఇప్పటివరకు జగన్కు లేఖ రాయడం కానీ ,జగన్ ను విమర్శించడం గాని చేయలేదు . తొలిసారి గా సౌభాగ్యమ్మ లేఖ రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది .
పులివెందుల గడ్డ సాక్షిగా సీఎం జగన్ తన చెల్లెలు షర్మిలపై సెటైర్లు వేసారు. పులివెందుల అసెంబ్లీ స్దానం నుంచి నామినేషన్ వేయడానికి గురువారం వచ్చిన సీఎం జగన్ ఈ సందర్బంగా బహిరంగసభలో తన ప్రత్యర్దులపై మండిపడ్డారు.
మేము ఓడితే నాకు కానీ చంద్ర బాబు కు ఏమి కాదు .కాని రైతులు,కార్మికులు ,విద్యార్థులు దెబ్బతింటారు .ఇది చూస్తూ నేను ఉరుకోలేను .అందుకే కూటమి కట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ-జనసేన ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నెల్లిమర్ల లో జ్యూట్ మిల్లు ను తెరిపిస్తామని చెప్పారు..