Published On:

Siddu Jonnalagadda: జాక్‌ డిజాస్టర్‌ – సగం రెమ్యునేషన్‌ వెనక్కి ఇచ్చిన హీరో

Siddu Jonnalagadda: జాక్‌ డిజాస్టర్‌ – సగం రెమ్యునేషన్‌ వెనక్కి ఇచ్చిన హీరో

Siddu Jonnalagadda Return Half Remuneration to Producer: స్టార్‌ బాయ్‌ సిద్ధు జొన్నలగడ్డ బ్యాక్‌ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. టిల్లు, టిల్లు స్క్వేర్‌ వంటి సినిమాల వరుస హిట్స్‌ దూసుకుపోతున్న్‌ ఈ స్టార్‌ బాయ్‌కి జాక్‌ షాకిచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 10, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బేబీ ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో ఆశించలేకపోయింది.

 

ఈ మూవీ ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో జాక్‌.. బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. సుమారు రూ. 36 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కేవలం రూ. 7 కోట్లు మాత్రమే రాబట్టినట్టు సమాచారం. ఈ మూవీ డిజాస్టర్‌తో నిర్మాతలు భారీగా నష్టపోయారు. సిద్ధు జొన్నలగడ్డ ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాడట. జాక్‌ మూవీ కోసం సిద్ధూ దాదాపు సుమారు రూ. 9 కోట్లకు పైనే పారితోషికంగా తీసుకున్నాడు. రిలీజ్‌కు ముందు జాక్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అనుకున్నారు.

 

కానీ, ఈ మూవీ డిజాస్టర్‌ అయ్యింది. దీంతో సిద్దు నిర్మాత పట్ల పెద్ద మనసు చేసుకుని తన రెమ్యునరేషన్‌లో సగం తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రూ. 4.5పైగా కోట్ల పారితోషికాన్ని నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌కు తిరిగి ఇచ్చేడాని సమాచారం. ఈ విషయం తెలిసి సిద్ధూపై నెటిజన్స్‌, ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిర్మాతల నస్టాల్ని పూడ్చేందుకు సిద్దు తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి హీరో ఇలా చేస్తే నిర్మాతలకు కాస్తా ధైర్యంగా ఉంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ తెలుసుకదా అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది.