Home / తాజా వార్తలు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ వేశారు . వారణాసి నుంచి లోక్ సభ కు మోడీ పోటీచేస్తున్న విషయం తెలిసిందే . మోదీ నామినేషన్ కార్యక్రమాని ఎన్డీయే మిత్ర పక్ష నాయకులు సైతం హాజరయ్యారు .
ముంబైలో హోర్డింగ్ జారిపడిన ఘటనలో 14 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతంలోని పెట్రోల్ పంపు పక్కన ఉన్న 100 అడుగుల హోర్డింగ్ తుఫాను గాలులకు కిందకు పడిపోవడంతో దీనికింద ఉన్న కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కార్లలో పలువురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అక్కడడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రస్తుతానికి ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా.. చూడని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో రాజకీయ పార్టీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
తమ గ్రామానికి రోడ్డు లేదని కొందరు ,తమ పంటకు గిట్టుబాటు ధర లేదని కొందరు ,తమ గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేదని కొందరు ఎన్నికలను బహిష్కరిస్తుంటే . మరోవైపు పోలింగ్ బూత్కు వెళ్లేందుకు సరైన దారిలేకపోయినా వాగులు వంకలు దాటుకుని ఓటు వేస్తున్నారు.
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోఆకస్మిక వరదలు సంభవించడంతో సుమారుగా 37 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. వరదల కారణంగా 100 కు పైగా ఇళ్లు, భవనాలు కొట్టుకుపోయాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్ద ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.
తమ సమస్యలు పరిష్కరించలేదన్న కారణంతో తెలంగాణలోని పలు గ్రామాల్లో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్థులు పోలింగ్ను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ వారు నిరసన తెలిపారు.
హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి కె మాధవి లత పై కేసు నమోదైంది . పోలింగ్ బూత్ వద్ద, బురఖా ధరించిన మహిళల గుర్తింపు పత్రాలను తనిఖీ చేయడం, వారి ముసుగును తీయమని కోరడం పై ఎంఐఎం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన హైదరాబాద్లో అసదుద్దీన్ ఒవైసీపై మాధవిలత తలపడుతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్ తనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన అనుచరుడు దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీ పోలీసులకు సోమవార ఉదయం ఓ కాల్ వచ్చింది. ఆ కాల్లో ఆమ్ఆద్మీపార్టీకి చెందిన నాయకురాలు, రాజ్యసభ ఎంపీ స్వాతిమలీవాల్పై దాడి జరిగిందని సమాచారం ఇచ్చారు
రష్యా సరిహద్దులోని బెల్గోరోడ్ అనే నగరంలో ఒక అపార్ట్మెంట్ భవనంలో కొంత భాగం కూలి 13 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. భవనం విధ్వంసానికి ఉక్రెయిన్ బాంబుదాడులే కారణమని రష్యా అధికారులు ఆరోపించారు. ఆన్లైన్లో ప్రసారం అవుతున్న వీడియోలు, రెస్క్యూ టీమ్లు ప్రాణాలతో బయటపడిన వారి కోసం శిధిలాల గుండా వెతుకుతూవెళుతున్నట్లు చూపిస్తున్నాయి.
నాలుగవ విడత లోకసభ ఎన్నికల ఓటింగ్ క్రమంగా జోరుందుకుంటోంది. మొత్తం తొమ్మిది రాష్ర్టాల్లో ఒక కేంద్ర ప్రాలిత ప్రాంతంతో సహా మొత్తం 96 నియోజకవర్గాల్లో ఉదయం 11 గంటల వరకు చూస్తే ఓటింగ్ 24.87 శాతంగా నమోదైందని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.