Home / తాజా వార్తలు
మనలో చాలా మంది ఒకరితో ఒకరు పోటీ పడి కప్పుల కొద్ది కాఫీ, టీలు తాగుతుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి హానికరమని ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) తాజా పరిశోధనలో తేల్చి చెప్పింది. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కనీసం ఒక గంట తర్వాత మాత్రమే టీ కానీ కాఫీ కానీ తాగాలని సూచించింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్వీ అశోకన్ క్షమాపణల పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా అశోకన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోర్టుకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.
OTT Platform:కేంద్రప్రభుత్వం వచ్చే ఆగస్టు నాటికి వీటికి పోటీగా సొంత ఒటీటీ ఫ్లాట్ఫాంను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం దీని బాద్యతను పబ్లిక్ సర్వీస్ బ్రాడ్క్యాస్టర్ ప్రసారభారతికి అప్పగించింది. ప్రసార భారతి దేశీయ ఓటిటికి రంగం సిద్దం చేస్తోంది. దేశీయ ఓటీటీ నెట్ ఫ్లిక్స్తో పాటు హాట్స్టార్కు పోటీ ఇవ్వబోతోంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రమోట్ చేస్తుంది. ఆగస్టులో అందుబాటులోకి వచ్చే ఓటీటీ ప్రారంభంలో ఒకటి, రెండు సంవత్సరాల పాటు ఉచితంగా […]
ఏపీ సీఎం వైఎస్ జగన్కు సీబీఐ కోర్టులో ఎట్టికేలకు ఊరట లభించింది. సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు యూకే వెళ్ళడానికి జగన్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తమ కుటుంబ సమేతంగా సీఎం జగన్ విదేశీ పర్యటన చేయనున్నారు.
నగరాల్లో నివసించే వాళ్లలో ఎక్కువగా విద్యాధికులు వుంటారు .ఉద్యోగాలు ,వ్యాపారాలు ,చేతిపనులు చేసుకునే వారు అధికం .అయితే పోలింగ్ రోజు మాత్రం ఇంటికే పరిమితం అవుతున్నారు .ప్రతి ఎన్నికల సమయంలో ఇదే తంతు జరుగుతుంది.దీనితో నగర వాసులకన్నా గ్రామీణ ప్రాంత వాసులకే ఎక్కువగా రాజకీయ చైతన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
పిఠాపురంలో జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రకండువా అనేది జనసేన జెండా కాదని ఆయన స్పష్టం చేశారు. మంగళ వారం పిఠాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో నాగబాబు మాట్లాడారు . పవన్ వేసుకున్నారు కాబట్టే దానికి అంత పాపులారిటీ వచ్చిందన్నారు. ఈ ఎర్రకండువాని కాశీతువాలంటారని.. అది తమ చిన్నప్పుడు నుంచి చూస్తూనే ఉన్నామన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ను ఢిల్లీ లోని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. మరో ఆరు రోజులపాటు అంటే మే 20 వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఏకంగా వంద శాతం పోలింగ్ నమోదైంది. తండాలో మొత్తం 210 మంది ఓటర్లు ఉండగా… తండా వాసులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దొంగలు మామూలు బస్సులు, రైలు ప్రయాణాల్లోనే కాదు... విమానాల్లో కూడా ఉంటారని తాజా సంఘటన రుజువు చేస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏడాదికి 200 సార్లు విమానాల్లో ప్రయాణించి ప్రయాణికుల ఖరీదైన వస్తువులు కొట్టేసేవాడు.
మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు లో చుక్కెదురైంది . 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీసు సిబ్బందిపై దాడికి సంబందించిన కేసును కొట్టేయాలని చంద్రబాబు, టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ తోసిపుచ్చింది .