Home /Author Mallikanti Veerabhadram
IMD Issued Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో వానలు పడతాయని ఐఎండీ తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ. వరకు ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు […]
September Month Darshanam tickets Release Today: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి సెప్టెంబర్ నెల కోటాను ఇవాళ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే వివిధ రకాల సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. కాగా ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు […]
Crude Oil Prices Hike: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధంలోకి తాజాగా అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో వాతావరణం మరింత ఉధృతంగా మారింది. ఇరాన్ లోని అణుకేంద్రాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. హర్మూజ్ జల మార్గాన్ని మూసివేసేందుకు ఆ దేశం సమాయత్తమవుతోంది. ప్రపంచ చమురు మార్కెట్ కు అడ్డాగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయించుకుంది. అందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనిపై సుప్రీం […]
Cabinet Meeting On local Elections: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ కానుంది. స్థానికల సంస్థల ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్ ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు బీసీలకు రిజర్వేషన్ల వర్తింపు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. గోదావరి జలాలపై ప్రభుత్వ వ్యూహాన్ని ఖరారు చేస్తారని తెలుస్తోంది. అలాగే త్వరలో ఏపీ […]
Rythu Bharosa Money Credits: రైతుభరోసా నిధుల పంపిణీలో రాష్ట్ర సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 6 రోజుల్లో 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7770.83 కోట్లు జమ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూన్ 16న రైతు నేస్తం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. […]
Six Detonators Found In Hanumakonda Court: దేశంలో ప్రతిరోజు ఏదో ఒకచోట బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఆగంతకులు నిత్యం ఇలాంటి బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. రైల్వేస్టేషన్లు, విమానాలు, రైళ్లు, స్కూళ్లు, హాస్పిటల్స్, పబ్లిక్ ప్లేసులు ఇలా అన్నిచోట్ల బాంబు బెదిరింపు హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హన్మకొండలో జరిగింది. హన్మకొండ కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణంలో […]
The Raja Saab Teaser Leaked: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్. ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ మూవీపై అటు మూవీ టీమ్, ఇటు ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెంచుకున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే తొలిసారిగా హారర్ రొమాంటిక్ కామెడీ మూవీని చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ డిసెంబర్ 5న […]
Brahmos Aerospace Expansion: రక్షణ రంగానికి చెందిన కీలక ప్రాజెక్ట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణుల ప్రాధాన్యత ఏంటో తెలిసిన తరుణంలో మిస్సైళ్ల ఉత్పత్తిని పెద్దఎత్తున పెంచాలని కేంద్రం భావిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా బాలానగర్ లో ఇప్పటికే మిస్సైల్ తయారీ కేంద్రం ఏర్పాటైంది. దీన్ని విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. […]
Minister Narayana On Yogandhra: రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ ముస్తాబైంది. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రజలకు రవాణా, పార్కింగ్, వసతుల సౌకర్యంపై మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. దాదాపు 5 లక్షల మందితో రేపు విశాఖలో యోగాభ్యాసం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాల వారు ఇవాళే విశాఖకు చేరుకుంటున్నారు. వారికి వసతులు […]
Crucial War Between Iran and Israel: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. గత వారం రోజులుగా పరస్పరం దాడులు జరుగుతుండగా.. ఇవాళ ఎనిమిదో రోజు కూజా ఇరుదేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ క్లస్టర్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ లోని ఆస్పత్రులు, స్టాక్ ఎక్స్చేంజ్ భవనంపై దాడులు చేసింది. దీంతో రాజధాని టెల్ అవీవ్ శివార్లలో భారీగా నష్టం ఏర్పడింది. దాడుల్లో […]