Home /Author Mallikanti Veerabhadram
Gaza: గాజాపై ఇజ్రాయెల్ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా జరుపుతున్న దాడులతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు గాజాపై జరిగిన దాడుల్లో 146 మంది ప్రజలు మృతిచెందారు. అయితే కాల్పుల విరమణ చేపట్టాలని ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఒప్పందం కుదిరినా దాడులు జరగడం విశేషం. తాజా దాడుల్లో 459 మంది పౌరులు గాయపడినట్టు గాజా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ మధ్య […]
Mulugu: తెలంగాణలోని ములుగు జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరి నుంచి భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట మరో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులు పలు హోదాల్లో పనిచేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నారు. అయితే లొంగిపోయిన మావోలకు ఒక్కొక్కరికి రూ. 25 […]
India- Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 22న లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే పహల్గామ్ దాడులకు సమాధానంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో 100 మందికిపైగా జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు […]
Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. పార్టీలోని 13 మంది కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆప్ సభా నాయకుడిగా ఉన్న ముఖేష్ గోయల్ తో పాటు.. మరో 12 మంది ఇవాళ పార్టీని వీడారు. వీరంతా కలిసి గోయల్ నేతృత్వంలో త్వరలోనే ఇంద్రప్రస్థ వికాస్ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు. అయితే […]
Telangana: మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో సీఎం మార్పు, మంత్రివర్గ విస్తరణ గురించి వస్తున్న ప్రచారంపై స్పందించారు. కాగా తెలంగాణ మంత్రివర్గంలో 18 మందికి మంత్రులుగా అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 12 మంది మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు. మిగిలిన 6 స్థానాలను భర్తీ చేసేందుకుగాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పలుమార్లు ప్రయత్నాలు చేసింది. అయినా ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక […]
USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండించారు. వెనెజులా నుంచి అమెరికాకు వలసవచ్చిన వారి బహిష్కరణకు సంబంధించిన కేసులో అక్కడి సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వెనెజులా వారిని బహిష్కరించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. ‘మన దేశంలోకి అక్రమంగా వచ్చిన వారిని బలవంతంగా పంపడాన్ని అనుమతించబోమని సుప్రీంకోర్టు ఇప్పుడే తీర్పు ఇచ్చింది. […]
Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరూర్ జిల్లా వెన్నమలై వద్ద టూరిస్ట్ వ్యాన్, ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. కాగా సేలం నుంచి కరూర్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వెన్నమలై వద్ద టూరిస్ట్ వ్యాన్ ను ఢీకొంది. వీరంతా తూత్తుకుడి నుంచి ఓ ట్రిప్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు చనిపోగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శనివారం […]
చెర్రీ పండ్లతో చాలా ఆరోగ్య లాభాలున్నాయి. అందుకే వీటిని తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
Mahabubnagar: మిస్ వరల్డ్ పోటీలకు విచ్చేసిన అందాల భామలు ఇవాళ పిల్లలమర్రిలో సందడి చేశారు. దాదాపు 700 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పిల్లలమర్రిలో అందాల భామలు కనువిందు చేశారు. కాగా మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన సుందరీమణులలో ఓ బృందం ఇవాళ పిల్లలమర్రికి వచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ చేరుకున్నారు. తెలంగాణ పండుగుల విశిష్టత సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ నృత్యాల మధ్య అందాల భామలకు ఘనస్వాగతం […]
PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈనెల 18న తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి పీఎస్ఎల్వీ- సీ61 రాకెట్ ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం రేపు ఉదయం 7.59 గంటలకు మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభంకానుంది. కాగా ఇస్రోకు ఇది 101వ ప్రయోగం. ఈ ప్రయోగంతో భూ పరిశీలన ఉపగ్రహం రిశాట్- 18ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. సుమారు 22 గంటల కౌంట్ […]