Last Updated:

Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి

ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో "యువశక్తి" సభ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.

Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి

Janasena Yuvashakthi: ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో “యువశక్తి” సభ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస పంచాయితీ పరిధిలో 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో పవన్ సభ నిర్వహిస్తున్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేసారు. సభా ప్రాంగణానికి వచ్చే నాలుగు గేట్లకు ఉత్తరాంద్ర యోధులైన గిడుగు రామ్మూర్తి పంతులు , వీరనారి గున్నమ్మ , కోడిరామ్మూర్తి నాయుడు, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు. ఈ సభ వేదికగా యువతకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.

జ్ఞాని ఎవరంటే..

మరోవైపు యువశక్తి సభకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే యువత కోసం భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సభలో ఏపీలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై యువశక్తి సభ ద్వారా పవన్ ప్రకటన చేస్తారు. మరోవైపు పవన్ బహిరంగ సభ నేపథ్యంలో అధికార, జనసేన పార్టీ నేతల మధ్య నెలకొన్న మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్ రాజుకుంది. కాగా ఈ సభలో రాష్ట్రంలోని యువత సమస్యలపై గళం విప్పేందుకు అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా 100 మంది ఈ సభలో రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై మాట్లాడారు. వారిలో ఓ ముస్లిం యువతి జ్ఞాని ఎవరంటే అని .. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించింది.

ఈ మేరకు ఆ యువతి మాట్లాడుతూ.. విద్య లేని వాడు వింత పశువు అని అంటారు. మరి విద్య ఉన్న వాడు ఏం పశువో తెలుసుకుందాం. విద్య మనకు సమానత్వం నేర్పించాలి. కానీ కులం, మతం, రంగును బట్టి ఇతరులతో మాట్లాడే వారు వింతపశువులే అని చెప్పింది. భగవద్గీత 5 వ అధ్యాయం 18 వ శ్లోకం “విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని.. శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః” ను ఉదాహరణగా చెప్పింది. నిజమైన పండితులు, దివ్య జ్ఞాన చక్షువులతో – ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమ-దృష్టితో చూస్తారు. అందుకే అందరూ జ్ఞానిలా మాట్లాడింది. దేశంలో 70% యువతే ఉన్నామని మార్పు చెందిన వాడే మనిషి అని, యువత అంతా ముందు చేంజ్ అవ్వాలని ఆ యువతి మాట్లాడింది. అలాంటి మార్పు జనసేన తోనే సాధ్యమని వ్యాఖ్యానించింది.

 

ఇవీ చదవండి

Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1

Nagababu : బాబాయ్ హత్య ఆయనకు తప్పుకాదు.. అడ్డం వచ్చినవారిని అడ్డుతొలగించడమే ఆయన పని : నాగబాబు

Veera Simha Reddy: బాలకృష్ణ వీర సింహారెడ్డిపై వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు… సినిమా దొబ్బింది అంటూ

Nagababu: పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు.. నాగబాబు కామెంట్స్ వైరల్

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: