Last Updated:

Kashmir solder: కశ్మీర్ లోసెలవుపై వచ్చి మాయమైన సైనికుడు

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఒక సైనికుడు మాయమయ్యాడు. జమ్మూ మరియు కాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన రైఫిల్‌మ్యాన్ జావేద్ అహ్మద్ ఈద్ సందర్భంగా సెలవుపై ఇంటికి వచ్చాడు. అతను తిరిగి వచ్చి రేపు డ్యూటీలో చేరాల్సి ఉంది.

Kashmir solder: కశ్మీర్ లోసెలవుపై వచ్చి మాయమైన సైనికుడు

Kashmir solder: దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఒక సైనికుడు మాయమయ్యాడు. జమ్మూ మరియు కాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన రైఫిల్‌మ్యాన్ జావేద్ అహ్మద్ ఈద్ సందర్భంగా సెలవుపై ఇంటికి వచ్చాడు. అతను తిరిగి వచ్చి రేపు డ్యూటీలో చేరాల్సి ఉంది.

నా కొడుకును విడుదల చేయండి..(Kashmir solder)

శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో మార్కెట్‌లో కొన్ని వస్తువులు కొనేందుకు అతను ఆల్టో కారులో బయటకు వచ్చాడు. రాత్రి 9 గంటల వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. మార్కెట్ సమీపంలో కారును కనుగొన్నారు. దానిలో రక్తపు మరకలు ఉన్నాయి. దీనిపై కాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.ఉగ్రవాదులు అతన్ని కిడ్నాప్ చేశారని అనుమానిస్తున్న సైనికుడి కుటుంబ సభ్యులు, అతడిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ వీడియో స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. దయచేసి మమ్మల్ని క్షమించండి. నా కొడుకును విడుదల చేయండి. నా జావేద్‌ను విడుదల చేయండి. నేను అతన్ని ఆర్మీలో పని చేయనివ్వను. కానీ దయచేసి అతన్ని విడుదల చేయండి అని సైనికుడి తల్లి రోదిస్తున్న వీడియోలో వినబడింది.

సైనికుడి తండ్రి మహ్మద్ అయూబ్ వానీ మాట్లాడుతూ నా కొడుక్కి లడఖ్ లో  పోస్టింగ్ ఇచ్చారు. అతను ఈద్ తర్వాత ఇంటికి వచ్చాడు.రేపు తిరిగి డ్యూటీలో చేరాల్సి ఉంది. అతను మార్కెట్ నుండి కొన్ని వస్తువులను కొనడానికి నిన్న సాయంత్రం బయలుదేరాడు. అతడిని కొందరు వ్యక్తులు అడ్డుకుని కిడ్నాప్ చేశారు. నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి నా కొడుకును విడుదల చేయండి అని వేడుకున్నాడు. గతంలో సెలవుపై ఇంట్లో ఉన్న పలువురు సైనికులను ఉగ్రవాదులు అపహరించి హతమార్చారు. దీనిపై జావేద్ కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.