Home / అంతర్జాతీయం
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దిన దిన గండం నూరేళ్ల ఆయుషులా తయారైంది. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ నడుంబిగించారు. కరాచీలోని వ్యాపారవేత్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దేశానికి చెందిన అతి పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే ముందుగా రాజకీయ సుస్థిరతకు ప్రయత్నించాలని సూచించారు వ్యాపారవేత్తలు.
కెన్యాలో భారీ వర్షాలకారణంగా ఇప్పటివరకూ 38 మంది మరణించారని కెన్యా రెడ్క్రాస్ సొసైటీ ( కెఆర్ సి ఎస్ ) ఒక ప్రకటనలో తెలిపింది. కెన్యా రాజధాని నైరోబీ, మాథారే మురికివాడల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో ఒకరు మరణించగా మరో ఆరుగురు వ్యక్తులు తప్పిపోయారు.
దేశంలో క్షీణిస్తున్న జనన రేటును పెంచే ప్రయత్నంలో జన్మించిన ప్రతి శిశువుకు తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహకాలను చెల్లించాలని దక్షిణ కొరియా పరిశీలిస్తోంది.దక్షిణ కొరియా ప్రభుత్వ అవినీతి నిరోధక మరియు పౌర హక్కుల కమిషన్ దీనిని అమలు చేయడానికి ముందు ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయడానికి ఒక పబ్లిక్ సర్వేను నిర్వహిస్తోంది.
తైవాన్ తూర్పు తీరంలో 24 గంటల వ్యవధిలో 6.3 తీవ్రతతో 80 భూకంపాలు సంభవించాయి. సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు సంభవించిన ఈ భూకంపాల ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది.
మలేసియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలో ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
తోషాఖానా కేసుకు సంబంధించి పాకిస్తాన్ కోర్టు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్కు ఆయన భార్యకు బుష్రాబీబీకి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఈ జంట పది సంవత్సరాల వరకు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. దీనితో పాటు వీరిద్దరు 78.7 కోట్ల రూపాయలు జరిమనా విధించింది. ఇదిలా ఉండగా మంగళవారం నాడు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు పిటిఐ వ్యవస్థాపకుడు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్కు, ఆయన మంత్రివర్గంలో విదేశాంగమంత్రిగా పనిచేసిన షా మహ్మద్ ఖురేషిని అధికార రహస్యాల చట్టం కింది పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా అవినీతి రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో డెన్మార్క్ అవినీతి రహిత దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత అవినీతి కలిగిన దేశాల్లో సోమాలియా 11 స్కోరుతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్ 39 స్కోరుతో మొత్తం 180 దేశాల్లో 93వ స్థానంలో నిలిచింది.
ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పదేళ్ల జైలు శిక్ష పడింది.పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు సైఫర్ కేసులో పాకిస్థాన్లోని ప్రత్యేక కోర్టు మంగళవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది.
రష్యాతో యుద్ధానికి 100,000 మోర్టార్ షెల్స్ను కొనుగోలు చేసేందుకు కేటాయించిన దాదాపు 40 మిలియన్ డాలర్లను పక్కదారిపట్టించడానికి ఉక్రెయిన్ ఆయుధ సంస్థ ఉద్యోగులు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి కుట్ర పన్నారని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది.
ఆఫ్రికాలోని చమురు సంపన్న ప్రాంతమైన అబేయిలోని గ్రామస్థులపై ముష్కరులు దాడి చేశారు.ఈ దాడిలో యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షకుడితో సహా 52 మంది మరణించగా 64 మంది గాయపడ్డారని ప్రాంతీయ అధికారి తెలిపారు.