Home / అంతర్జాతీయం
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్ , రిపబ్లికన్పార్టీ అభ్యర్ది డొనాల్డ్ ట్రంప్కు గట్టి షాక్ తగిలింది.ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసు లో న్యూయార్క్లోని మాన్హటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమెకు 83 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో గత మూడువారాల్లో 200 మందికి పైగా పిల్లలు న్యుమోనియా తో మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. పంజాబ్ కేర్టేకర్ ప్రభుత్వం మరణించిన పిల్లలలో చాలా మంది న్యుమోనియాకు టీకాలు తీసుకోలేదని తెలిపింది. పోషకాహార లోపం, తల్లిపాలు లేని కారణంగా వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని పేర్కొంది.
ఒక లగ్జరీ బ్యాగ్ దక్షిణ కొరియా అధికార పార్టీని షేక్ చేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీ ఖరీదైన బ్యాగ్ను బహుమతిగా పొందారంటూ వైరల్ అయిన దృశ్యాలు ఈ పరిస్థితి కారణమయ్యాయి.
హమాస్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నయుద్ధంలో ఒళ్లు జలదరించే అంశాలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి తమ వెంట సుమారు వంద మంది మహిళలను బందీలుగా తీసుకువెళ్లారు. ప్రస్తుతం వారిలో కొంత మంది గర్భం దాల్చారు.
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాక్ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నాక వారద్దిరిపై సోషల్ మీడియాలో పాక్ ప్రజలు విరుచుకు పడుతున్నారు. వారిద్దరు తమ జీవిత భాగస్వాముల నుంచి విడాకులు తీసుకోవడాన్ని వారు తప్పు బడుతున్నారు. ఈ నేపధ్యంలో సానియా మీర్జాకు పాకిస్తాన్లోని ప్రజల నుండి బలమైన మద్దతు లభించడం విశేషం.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ఖాన్ యూనిస్లో హమాస్పై దాడులను కొనసాగిస్తోంది. ఇక్కడ ఉగ్రవాదులు నాజర్, అల్-అమల్ ఆసుపత్రుల లోపల మరియు చుట్టుపక్కల నుండి పనిచేస్తున్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారిక ప్రతినిధి ఇలోన్ లెవీ చెప్పారు.
చైనాలోని ఒక వృద్ధ మహిళ తన $2.8 మిలియన్ల సంపదను తన పిల్లులు. కుక్కలకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. షాంఘైకి చెందిన సియు కొన్ని సంవత్సరాల క్రితం వీలునామా తన ముగ్గురు పిల్లలకు తన ఆస్తిని ఇస్తూ వీలునామా రాసింది.అయితే తాజాగా ఆమె మనసు మార్చుకుంది. సియు అనారోగ్యం పాలైనప్పుడు పిల్లలు ఆమెను పట్టించుకోలేదు కాబట్టి ఆమె వీలునామాను సవరించింది
: తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్లోని జిన్యు నగరంలో బుధవారం మధ్యాహ్నం భవనంలో మంటలు చెలరేగడంతో 39 మంది మరణించగా తొమ్మిది మంది గాయపడ్డారు. జిన్యులోని యుషుయ్ జిల్లాలో వీధి దుకాణంలో మంటలు చెలరేగాయని స్థానిక ఫైర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ ప్రధాన కార్యాలయం తెలిపింది.
సౌదీ అరేబియా ప్రభుత్వం రాజధాని రియాద్లో ప్రత్యేకంగా ముస్లిమేతర దౌత్యవేత్తలకు సేవలందించే మొట్టమొదటి ఆల్కహాల్ దుకాణాన్ని తెరవడానికి సిద్ధమవుతోంది. సౌదీ అరేబియాలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మద్యం తాగిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి.
మాలిలోని బంగారుగనిలో సొరంగం కూలి 70 మందికి పైగా మరణించారని స్థానిక స్థానిక అధికారి బుధవారం తెలిపారు. గత వారం జరిగిన ఈ ప్రమాదసమయంలో 200 మందికి పైగా కార్మికులు ఉన్నారని చెప్పారు. 73 మృతదేహాలను కనుగొన్నామంటూ బంగారు గనుల అధికారి ఓమర్ సిడిబే తెలిపారు.