Home / latest national news
చత్తీస్గఢ్లో పికప్ వ్యాన్ బోల్తా పడ్డంతో సుమారు 18 మంది మృతి చెందారు. వారిలో 17 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.. నలుగురికి గాయాలు అయ్యాయని చత్తీస్గఢ్లోని కబీర్థామ్ జిల్లాలో పికప్ వ్యాన్ లోయలోపడ్డంతో జరిగిన ఘటనతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అధికారులు సోమవారం నాడు చెప్పారు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నెలకొంది. సోమవారం నాడు ఐదవ విడత పోలింగ్ జరుగుతోంది. ఇక మిగిలింది కేవలం రెండు విడతల పోలింగ్ మాత్రమే. ఇక అందరి దృష్టి స్టాక్ మార్కెట్లపై పడింది. ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి.
కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ర్ట బీజేపీ నాయకుడు జీ దేవరాజ్ గౌడను శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీస వాహనంలో తరలిస్తుండగా కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా మోదీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఖర్గే ఎన్నికల కమిషన్ను కోరారు.
స్వాతి మలీవాల్పై జరిగిన దాడి కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతిమలీవాల్ కేజ్రీవాల్ను పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు కేజ్రీవాల్ పర్సెనల్ సెక్రటరీ తనపై దాడి చేశాడని ఆమె పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు
ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించి ఓట్లు దండుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక జాతీయ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల సందర్భంగా ఇచ్చే తాయిలాల గురించి పలు ప్రశ్నలు సంధించారు.
కేంద్ర పౌర విమానయానశాఖమంత్రి జ్యోతిర్యాధిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా బుధవారం ఉదయం 9.28 గంటలకు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్ను మూశారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. ఆమె గత మూడు నెలల నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా జల్ విలాస్ ప్యాలెస్ అధికారులు మాత్రం గురువారం నాడు ఆమె అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు.
న్యూస్క్లిక్ వ్యవస్థాపక ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ అరెస్టు చెల్లుబాటు కాదని.. తక్షణమే విడుదల చేయాలని బుధవారం నాడు సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం జడ్జిలు బీఆర్ గవాయి, సందీప్ మెహతాలతో కూడిన న్యూస్ క్లిక్ ఎడిటర్ అరెస్టుకు సంబంధించి రిమాండ్ కాపీ తమకు అందజేయలేదని, కాబట్టి ప్రబీర్ పురకాయస్థ అరెస్టు చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్వీ అశోకన్ క్షమాపణల పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా అశోకన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోర్టుకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.
OTT Platform:కేంద్రప్రభుత్వం వచ్చే ఆగస్టు నాటికి వీటికి పోటీగా సొంత ఒటీటీ ఫ్లాట్ఫాంను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం దీని బాద్యతను పబ్లిక్ సర్వీస్ బ్రాడ్క్యాస్టర్ ప్రసారభారతికి అప్పగించింది. ప్రసార భారతి దేశీయ ఓటిటికి రంగం సిద్దం చేస్తోంది. దేశీయ ఓటీటీ నెట్ ఫ్లిక్స్తో పాటు హాట్స్టార్కు పోటీ ఇవ్వబోతోంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రమోట్ చేస్తుంది. ఆగస్టులో అందుబాటులోకి వచ్చే ఓటీటీ ప్రారంభంలో ఒకటి, రెండు సంవత్సరాల పాటు ఉచితంగా […]