Home / latest education news
నీట్ ద్వారా పీజీ మెడికల్ కోర్సుల్లో అన్ని రాష్ట్రాలు ఒకే సారి కౌన్సిలింగ్ చేయడం లేదు. ఒక్కో చోట ఒక్కో ప్రొసీజర్. మొదట డీమ్డ్ యూనివర్శిటీలకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని నాన్ లోకల్ కోటా సీట్లకు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ కు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. మరి దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ అభ్యర్దులకు సూచనలు అందించారు.
చాలా యూనివర్శిటీలు ఇపుడు 12 వ తరగతి తరగతి తరువాత ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో బీఎస్సీప్లస్ ఎమ్మెస్సీ, బిటెక్ ప్లస్ ఎంటెక్ తదితర కోర్సులు ఉంటున్నాయి. ఈ కోర్సులు చేయడం మంచిదేనా ? అయితే ఈ కోర్సులు చేద్దామనుకున్నవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలని చెబుతున్నారు ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ కుమార్.
నీట్ కౌన్సిలింగ్ తెలంగాణలో ప్రారంభమవుతున్న నేపధ్యంలో చాలామంది విద్యార్దులు తమకు సీటు వస్తుందా రాదా అనే ఆందోళనలో ఉన్నారు. అయితే గతంలో కంటే మెడికల్ సీట్లు పెరిగినందున కంగారు పడనవసరం లేదని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు. మెదటి, రెండు, మాప్ అప్ రౌండ్లు అయ్యాక కూడా గత ఏడాది పలు ప్రైవేట్ కాలేజీల్లో బి కేటగిరి సీట్లు మిగిలిపోయాయని అయన చెబుుతన్నారు.
Education And Careers: ప్రస్తుతం కాలంలో చదవు అనేది బాగా ఎక్స్పెన్సివ్ అయ్యింది. విద్యలో అనేక రకాల సిలబస్ లు ఉన్నాయి. మరి స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అంటే ఏంటి.. ఏ విద్యార్థులు ఎలాంటి సిలబస్ తీసుకుంటే మంచిది అనేది డాక్టర్ సతీష్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్దలయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు) యొక్క క్యాంపస్ లను విదేశాల్లో కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ను ఆఫ్రికాలోని టాంజానియాలో, ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ ను అబుదాబిలో, ఐఐటీ ఖరగ్ పూర్ క్యాంపస్ ను కౌలాలంపూర్ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తున్నారు.
నీట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్దులకు కౌన్సిలింగ్ కు సిద్దమవుతున్నారు. వైద్యవిద్యకు సంబంధించి ప్రతిష్టాత్మక సంస్దలు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. (ఎయిమ్స్ ). వీటిలో ఢిల్లీలో ఎయిమ్స్ పాతది. మంచి ప్యాకల్టీ, సదుపాయాలు ఉన్న సంస్ద.
వైద్యవిద్యలో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో జాయిన్ అవుదామనుకునే వారి బలహీనతలనుఆసరాగా చేసుకుని కొంతమంది దందాకు తెరతీస్తున్నారు. కాలేజీ యాజమన్యాలతో మాట్లాడి సీట్లు ఇప్పిస్తామని చెబుతూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు
MBBS seat in Pondicherry: నీట్ పరీక్ష ద్వారా పలు రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్లు ప్రారంభవుతున్నాయి. ఈ నేపధ్యంలో బయట రాష్ట్రాల్లో చదువుదామనుకునే తెలుగు విద్యార్దులు నాన్ లోకల్ కోటాలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బి కేటగిరిలో సీట్లు పొందలేని విద్యార్దులకు పాండిచ్చేరి మంచి అవకాశమని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు. ఎన్ఆర్ఐ కోటా ఫీజు తక్కువే.. (MBBS seat in Pondicherry) పాండిచ్చేరిలో మూడు ప్రైవేట్ […]
నీట్ ఎగ్జామ్ ద్వారా MBBS కోర్సుల్లో ప్రవేశాలకు పలు రాష్ట్రాలు నోటిఫికేషన్ జారీ చేస్తున్నాయి. అయితే ఎక్కువ ర్యాంకు వచ్చి ఏపీ, తెలంగాణలో 'B' కేటగిరీ సీట్లకు ఎక్కువ ఫీజు చెల్లించలేని విద్యార్దులకు ప్రత్యమ్నాయాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ .
ఇంటర్మీడియట్ బైపీసీ తో చదివిన వారు కంప్యూటర్ సైన్స్ తో ఇంజనీరింగ్ చేయవచ్చా? కొన్ని యూనివర్శిటీలు, కాలేజీలు తమకు ఈ కోర్సులకు అనుమతి ఉందంటూ చెబుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.