Home / CM Revanth Reddy
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 65 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఐటీఐ)లను అత్యాధునిక శిక్షణా సంస్థలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) - 2024 ఫలితాలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ప్రకటించారు. ఈ పరీక్షకు 2,86,381 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.
: బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతోషాన్ని ఇచ్చాయని.. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం పెరిగిందని రేవంత్ అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలకు విఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఆఫ్ట్రాల్ నువ్వేంత్ రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ప్రజలు ఆశీర్వదించి ఒక అవకాశం ఇస్తే.. నీకు ఆ పదవి వచ్చిందని ధ్వజమెత్తారు. పదవి నీ సొంతం కాదు, నీ జాగీరు కాదు.. అది ప్రజల హక్కు అని విమర్శించారు.
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు సమీకరించాలని అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తన చెల్లి షర్మిలను రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నారని ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. షర్మిల తమ పార్టీ సభ్యురాలని తమకు పొరుగున ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలన్నారు.
ఈ నెల ఎనిమిదో తేదీ లోపు రైతు భరోసా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తొమ్మిదో తేదికేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలని.. బకాయి ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
న్నికల వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రది మోదీ పై విరుచుకు పడుతున్నారు .మోదీ తెలంగాణకు చేసింది ఏమి లేదు గాడిద గుడ్డు అంటూ సెటైరికల్ గా ప్రచారం చేతున్న రేవంత్ రెడ్డి తాజాగా మరో సారి హాట్ కామెంట్స్ చేసారు . రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
దేశంలో రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర బీజేపీ చేస్తోందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానిగా మోదీ మళ్లీ గెలిస్తే.. 2025 లో రిజర్వేషన్లను రద్దు చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయడానికి మోదీ పనిచేస్తున్నారని అన్నారు .