Home / Andhra Pradesh
Visakhapatnam: విశాఖలో తాజాగా లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. 2 వందల కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తున్నట్టు తెలిపారు. లోన్ యాప్ల ద్వారా పలు ముఠాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. యాప్లో 2 వేల రూపాయల అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడి ద్వారా ఈ కేసు చేధించినట్టు చెప్పారు. నరేంద్ర భార్య […]
అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మే 2వ తేదీన జరిగే సభ ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే గత ప్రభుత్వ కారణంగా నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని మోదీ కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా […]
Simhachalam: విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీవరాహలక్ష్మీ నరసింహాస్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు. హోంమంత్రికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత.. అధికారులకు పలు సూచనలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు మంత్రుల బృందం చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించడం జరిగిందన్నారు హోంమంత్రి అనిత. […]
Andhra Pradesh: నమ్మకానికి దృఢ సంకల్పం తోడైతే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అథితిగా హాజరయ్యారు. వేధికపై మాట్లాడిన ఆయన, విజయం సులభంగా రాదని అందుకు కృషి అవసరమన్నారు. అందుకు ఎన్టీఆర్ నిధర్శనమన్నారు. చదువుకునే రోజుల్లో నేను బాగా చదువుకుంటే ఐఏఎస్ అవుతావని కొందరు అనేవారన్నారు. అయితే పదిమంది అధికారులలో ఒకడిని అవుతానని అనుకున్నాను. మా యునివర్సిటీలో […]
Andhra Pradesh Governmnet guidellines released on sc classification and reservations: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ మార్గదర్శకాలు, నిబంధనలతో ఏపీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే సర్కార్ గెజిట్ జారీ చేసింది. తాజాగా, ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ విషయంలో నిబంధనలు, మార్గదర్శకాలు రిలిజ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రూప్ 1లో రెల్లి సహా 12 ఉపకులాలకు […]
Heavy rains in Telangana and Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్లో అంబర్ పేట, తెల్లాపూర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, హఫీజ్ పేట్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్, రామంతాపూర్, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఎస్.ఆర్. నగర్, […]
Former MP Vijay Sai Reddy Attends SIT Enquiry in AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు విషయంపై సిట్ చేపట్టిన విచారణ ముగిసింది. ఈ విచారణ మూడు గంటల పాటు కొనసాగింది. ఈ కేసులో భాగంగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ విచారించింది. ఈ మేరకు లిక్కర్కు సంబంధించి రెండు మీటింగులు జరిగాయా? అని సిట్ ప్రశ్నించిందని విజయసాయి రెడ్డి అన్నారు. 2019 చివరిలో మీ ఇంట్లో మీటింగ్ జరిగిందా? అని […]
Telangana and Andhra Pradesh States Weather Reports: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. తెలంగాణతో పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, యానాం ప్రాంతాల్లో గంటకు […]
Election Notification for Ap Rajya Sabha Seat: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీనికి భర్తి చేసేందుకు ఎన్నికల సంఘం ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ని విడుదల చేసింది. త్వరలోనే ఈ నెల 22 నుంచి 29 […]
AP Government changes in Grama and Ward Sachivalayams: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వివిధ శాఖల కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. కార్యదర్శులకు సాధారణ విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, 2,500 అంతకంటే తక్కువ జనాభా ఉన్న సచివాలయానికి ఇద్దరు సిబ్బంది కేటాయించింది. దీంతో పాటు […]