Home / Andhar Pradesh
వైసీపి మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన లోపాల గురించి ప్రశ్నిస్తే అసభ్యంగా తిడుతున్నారని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చివైసీపి అరాచక పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై మరో వినూత్న డిజిటల్ క్యాంపెయిన్ కు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారుల దుస్థితిపై ఒక నిమిషం వీడియో లేక నాలుగు ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలంటూ జనసేనాని పిలుపునిచ్చారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ హష్ టాగ్ తో ఉదయం నుండి సోషల్ మీడియాలో జనసైనికుల పోస్టులు హల్చల్
తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయని. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో షీర్ జోన్ ఎఫెక్ట్ కొనసాగుతోందని, ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు.
ఏపీ సీఎం జగన్ ఏరియల్ నేడు వరదప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏరియల్ సర్వే కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న 24 నుంచి 48 గంటల్లో వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.
ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందిన కార్యకర్త పాడె మోసారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందని వైసీపీ కార్యకర్త శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి కారుమూరిగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది. ఇది భూమిపైనే కొనసాగుతూ రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతి పక్షాలతో పాటు కొన్ని మీడియా ఛానల్లు విషం కక్కుతున్నాయని మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ని భ్రష్టు పట్టించాలని ప్రతిపక్షాలు కొన్ని మీడియా ఛానల్లతో పాటు చంద్రబాబు దత్తపుత్రుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.
కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ $600 మిలియన్ల విలువైన సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసింది మరియు అదే సంవత్సరంలో 836,000 టన్నుల మిర్చిని ఉత్పత్తి చేసింది.
లోన్ యాప్ ల వేధింపులకు గుంటూరు జిల్లాలో మరోకరు బలయ్యారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన ప్రత్యూష ఇటీవల ఇండియన్ బుల్స్, రూపి ఎక్స్ ఎమ్ రుణ యాప్ లో 20 వేలు తీసుకుంది. అయితే లోన్ తీసుకున్న తరువాత ప్రతీ నెల చెల్లింపులు చేసిన ప్రత్యూష. మరో 8వేలు చెల్లించాల్సి ఉంది.