Home / క్రికెట్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట పై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే ఈ ఘటన పై 3కేసులు నమోదు చేశారు. తాజాగా హెచ్సీఎ పై బేగంపేట పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
గత కొద్దిరోజులుగా జడేజా మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికే పరిమితమవ్వగా అతనిని పలకరించడానికి ధావన్ ఆసుపత్రికి వెళ్లారు. కాగా తను నొప్పితో బెడ్ పై ఉండగా ధావన్ డాన్స్ చేస్తూ సందడి చేస్తాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారత్, ఇంగ్లండ్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ మన్కడ్ చేసింది. దీనికి సంబంధించి ఓ క్రికెట్ అనలిస్ట్ చేసిన అనాలసిస్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ విజయంతో టీం ఇండియా టీ20లలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. గతంలో పాకిస్తాన్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలుకొట్టడమేకాక కొత్త రికార్డును సృష్టించింది.
టీమిండియాపై ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల టీ20 లో సిరీస్ను కైవసం చేసుకుంది.ఈ సిరీస్ను 2-1తో టీమిండియా గెలుచుకుంది.హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో టీ20 మూడవ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఆస్ట్రేలియా మొదటిగా బ్యాటింగ్ చేసి 120 బంతులకు 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 7-8 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా దూకుడు మామూలుగా లేదు ఆ సమయంలో 220 పరుగులు ఈజీగా చేసేస్తారనిపించింది.ఆ సమయంలో టీమిండియా వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా రన్ రేట్ తగ్గుతూ వచ్చింది.
టీ20ల సిరీస్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో ఆసీస్పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. తరువాత టీమ్ఇండియా 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో సిరీస్ను 2-1 తేడాతో టీమ్ఇండియా కైవసం చేసుకుంది.
ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7గంటలకు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ను వీక్షించేందుకు మంత్రి శ్రీనివాస గౌడ్ ఉచిత ఏర్పాట్లు చేశారు. అయితే ఈ అవకాశం టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్ లో చోటుచేసుకొన్న తొక్కిసలాటలో గాయపడ్డ క్రీడాభిమానులకు మాత్రమే.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ తుది దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరొకటి విజయం సాధించి స్కోర్ సమం చేసుకోగా.. ఇక సిరీస్ నిర్ణయాత్మక పోరుకు నేడు ఉప్పల్ స్టేడియం వేదికకానుంది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మరింత ఉత్కంఠ బరితంగా మారింది. నాగపూర్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీం ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ని 1-1గాసమం చేసింది. అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి టీం ఇండియా పగతీర్చుకుంది.
భారత్ - ఆసీస్ మ్యాచ్కు పూర్తి భద్రత కల్పించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు.