Home / క్రికెట్
బంతిని పాలిష్ చేయడానికి లాలాజలాన్ని ఉపయోగించడం పై నిషేధం అంతర్జాతీయ క్రికెట్లో కోవిడ్ -19 కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమలులో ఉంది. ఇపుడు దీనిని శాశ్వతంగా నిషేధిస్తున్నారు.
ఆసియాకప్ పరాభవం తర్వాత భారత జట్టు మరో టీ20 సిరీస్ కు సిద్దం అయ్యింది. ఆస్ట్రేలియాతో నేటి నుంచి మూడు మ్యాచ్లకు తెర లేవనుంది. మొహాలీ వేదికగా రాత్రి ఏడుగంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది.
యువరాజ్ సింగ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి నేటికీ 15 ఏళ్ళు , టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 15 ఏళ్ల క్రితం టీమిండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ క్రికెట్ చరిత్రలో ఒక మైలు రాయిని సృష్టించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ దూరమయ్యారు. కరోనా కారణంగా అతను ఈ సిరీస్ కు దూరం కాగా అతని ప్లేస్లో ఉమేష్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నారు.
భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో మూడు వన్డేలు ఆడుతుంది. మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టీ20కి ముందు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాను ఓడించకపోతే టీ20 ప్రపంచకప్ను భారత్ గెలవలేదని అన్నాడు.
సంజూ శాంసన్ అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ను భారత్ ఏ జట్టుకు కెప్టెన్గా ప్రకటించింది. న్యూజిలాండ్-ఏతో ఇండియాలో జరిగే మూడు వన్డేల సిరీసులకు భారత సెలక్టర్లు జట్టును ప్రకటించారు.
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఇష్టపడని క్రికెట్ అభిమానులుండరు. ఆ మ్యాచ్ ఆద్యంతం ఎప్పడు ఏం జరుగుతుందా.. ఎవరెలా ఆడతారా అనే ఆసక్తితో చూస్తుంటారు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కు టికెట్స్ ఫుల్ అయ్యాయి.
రాబిన్ ఊతప్ప క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తొలి టీ20 ప్రపంచకప్ హీరోగా రికార్డుకెక్కిన ఊతప్ప.. టీ20 ప్రపంచకప్లో తొలి బౌలౌట్లో భారత్ను గెలిపించాడు. కాగా ఈ బౌలర్ బుధవారం క్రికెట్ యొక్క అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.
బీసీసీఐ తన రాజ్యాంగంలో ప్రతిపాదించిన మార్పును సుప్రీంకోర్టు బుధవారం (సెప్టెంబర్ 14) ఆమోదించింది. దీనితో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మరియు సెక్రటరీ జే షా ఇతర ఆఫీస్ బేరర్ల పదవీకాలాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది.
ఇటీవల కాలంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లలో బుమ్రా కనిపించకపోవడం చూసాము. అయితే గాయం అయిన కారణంగా ఆసియా కప్ కు దూరమైన టీమ్ఇండియా సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.