Published On:

Indian Army : సరిహద్దుల్లో పాక్ ఆర్మీ విచక్షణారహిత కాల్పులు.. 15 మంది భారత పౌరులు మృతి

Indian Army : సరిహద్దుల్లో పాక్ ఆర్మీ విచక్షణారహిత కాల్పులు.. 15 మంది భారత పౌరులు మృతి

Indian Army : కొద్ది రోజులుగా సరిహద్దు నియంత్రణ రేఖ ఎల్‌వోసీ వెంట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పహల్గాం ఉగ్రదాడికి బదులుగా పాకిస్థాన్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ సైన్యం మంగళవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడులకు పాల్పడింది. దీంతో బుధవారం పాకిస్థాన్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతిచెందారు. 43 మంది గాయపడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. పూంఛ్, తంగ్ధర్ సెక్టార్లలో మంగళవారం రాత్రి నుంచి పాకిస్థాన్ బలగాల కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొంది. సాధారణ నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్థాన్ బలగాల కాల్పులకు పాల్పడుతోంది.

 

మరోవైపు ఉగ్రస్థావరాలపై ఇండియా జరిపిన దాడుల్లో దాదాపు 70 మందికిపైగా ఉగ్రవాదులు మృతిచెందినట్లు తెలుస్తోంది. 9 ఉగ్రస్థావరాలపై ఇండియా సైన్యం దాడులకు పాల్పడింది. గత నెలలో విహార యాత్రకు వెళ్లిన పర్యాటకులపై పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. కాగా, అప్పటి నుంచి పాక్‌పై అన్ని వైపులా ఇండియా ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. ఇప్పుడు ఉగ్రస్థావరాలపై ఇండియా సైన్యం దాడి చేసింది. ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పారంటూ కేంద్రంపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

ఇవి కూడా చదవండి: