Last Updated:

Manipur Women: మణిపూర్ .. సుప్రీంకోర్టును ఆశ్రయించిన లైంగిక వేధింపుల వీడియో బాధిత మహిళలు

మణిపూర్ లైంగిక వేధింపుల వీడియోలో కనిపించిన ఇద్దరు మహిళలు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వారి పిటిషన్‌ను నేడు విచారించనుంది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.

Manipur Women: మణిపూర్ .. సుప్రీంకోర్టును ఆశ్రయించిన లైంగిక వేధింపుల వీడియో బాధిత మహిళలు

Manipur Women: మణిపూర్ లైంగిక వేధింపుల వీడియోలో కనిపించిన ఇద్దరు మహిళలు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వారి పిటిషన్‌ను నేడు విచారించనుంది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.

కేంద్రానికి నివేదిక ..(Manipur Women)

ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 7 మంది నిందితులను అరెస్టు చేశారు.అంతకుముందు, మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే ఆదివారం దారుణమైన గ్యాంగ్ రేప్ నేరంలో ఇద్దరు బాధితులకు పరిహారం అందించారు. మణిపూర్‌లోని చురచంద్‌పూర్ ప్రాంతంలో జరిగిన హింసాకాండలో గాయపడిన ఏడుగురికి ఆమె రూ.15,000 చొప్పున అందించారు. ఆమె చురచంద్‌పూర్ ప్రాంతంలోని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (CSO) మరియు ఇతర వ్యక్తులను కూడా కలిశారు.రాష్ట్ర నలుమూలల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆమె.. పూర్తిస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను త్వరలో కేంద్రానికి అందజేయనున్నారు.

మణిపూర్‌లోని తౌబాల్ ప్రాంతంలో ముగ్గురు మహిళలను వివస్త్రను చేసి, నగ్నంగా ఊరేగించారన్న ఘటనపై దర్యాప్తు చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. ఈమేరకు ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.