Home / తాజా వార్తలు
కరోనాకు పుట్టినిల్లు చైనా. ప్రపంచమంతా ప్రజలు కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే చైనాను కరోనా ఇంకా వదల్లేదు. ఇప్పటికి చైనీయులు వణికిపోతూనే ఉన్నారు. జీరో టాలరెన్స్తో కరోనాను అదుపు చేస్తున్నారు.
తాను భారత సైన్యంలో చేరాలనుకున్నానని, అయితే కుటుంబ కారణాల వల్ల కుదరలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అస్సాం రైఫిల్స్ మరియు భారత సైన్యంలోని 57వ మౌంటైన్ డివిజన్ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ నేను కూడా సైన్యంలో చేరాలని కోరుకున్నాను.
హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు సార్లు సీఎస్కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ నేతలను నల్లుల్లా నలిపేస్తానని హెచ్చరించారు. వినుకొండలో గురువారం వాణిజ్య సముదాయం భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై గురువారం ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. వీడియో కాల్ ఇద్దరి మధ్య జరిగిందని, మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియో అదని చెప్పారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను.. ల్యాబ్కి పంపి రిపోర్టు తీసుకున్నారని, ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చే నివేదికకు విలువ ఉండదన్నారు.
ప్రపంచం మొత్తం అధిక జనాభాతో సతమతమవుతోంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తమ దేశం తల్లులను ఎక్కువ మంది పిల్లలను కనండి అని ప్రోత్సహిస్తున్నారు. రష్యాలో క్రమంగా శిశు జననాల రేటు తగ్గిపోవడంతో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీఎం కేసీఆర్.. తెలంగాణాలో ఇన్నాళ్లూ తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. అయితే.. గంత కాలంగా రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ క్రమంగా బలపడుతుండటంతో టీఆర్ఎస్లో సహజంగానే కలవరం మొదలైనట్లు తెలుస్తోంది.
కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణలో ఒక్కసారిగా న్యూస్మేకర్స్గా నిలిచారు. రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడులో ఆయన నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ ఎంపీగా గెలిచినా కల్వకుంట్ల కవిత పసుపు రైతులను పట్టించుకోలేదని విమర్శలు వినిపించాయి.పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ ఇచ్చి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు ధర్మపురి అరవింద్. పసుపు రైతులకు స్పైస్ బోర్డు ఏర్పాటు చేసిన అరవింద్ను రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ సరికొత్త వ్యూహానికి తెరతీసింది. రైతులను ఎంపీపైకి ఉసిగొల్పడంతో దాడుల వరకు వెళ్లింది రాజకీయం.
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామో ఘెబ్రేయేషన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇప్పటి వరకు మంకీపాక్స్ 92 దేశాలకు విస్తరించగా, 35వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.