Last Updated:

Food grain storage scheme: సహకార రంగంలో రూ.లక్ష కోట్లతో ఆహారధాన్యాల నిల్వ పథకం

సహకార రంగంలో ఆహారధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని 700 లక్షల టన్నులకు పెంచేందుకు రూ.1 లక్ష కోట్ల కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.ప్రస్తుతం దేశంలో ధాన్యం నిల్వ సామర్థ్యం 1,450 లక్షల టన్నులు ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ వివరాలను తెలియజేస్తూ చెప్పారు.

Food grain storage scheme: సహకార రంగంలో రూ.లక్ష కోట్లతో ఆహారధాన్యాల నిల్వ పథకం

 Food grain storage scheme: సహకార రంగంలో ఆహారధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని 700 లక్షల టన్నులకు పెంచేందుకు రూ.1 లక్ష కోట్ల కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.ప్రస్తుతం దేశంలో ధాన్యం నిల్వ సామర్థ్యం 1,450 లక్షల టన్నులు ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ వివరాలను తెలియజేస్తూ చెప్పారు.

ప్రతి బ్లాక్‌లో 2,000 టన్నుల సామర్థ్యం గల గొడౌన్‌..( Food grain storage scheme)

వచ్చే ఐదేళ్లలో నిల్వ 2,150 లక్షల టన్నులకు విస్తరించనుంది.సహకార రంగంలో నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.సహకార రంగంలో ప్రతిపాదిత పథకాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆహారధాన్యాల నిల్వ కార్యక్రమం”గా పేర్కొంటూ, ప్రతి బ్లాక్‌లో 2,000 టన్నుల సామర్థ్యం గల గొడౌన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు.ఆహార ధాన్యాల నష్టాన్ని తగ్గించడం,, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం మరియు గ్రామీణ భారతదేశంలో ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ చర్య యొక్క లక్ష్యం అని ఆయన చెప్పారు.ఎక్కువ నిల్వ సామర్థ్యం రైతులకు రవాణా ఖర్చులను తగ్గించి ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని మంత్రి అన్నారు.భారతదేశం ఏటా దాదాపు 3,100 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుంది, అయితే ప్రస్తుతం ఉన్న గోడౌన్లలో కేవలం 47 శాతం ఉత్పత్తులను మాత్రమే నిల్వ చేయవచ్చు.