Published On:

Mumbai Bomb Threat: ఉగ్రవాదులకు ఉరేసినందుకు ముంబైలో బాంబు బెదిరింపులు

Mumbai Bomb Threat: ఉగ్రవాదులకు ఉరేసినందుకు ముంబైలో బాంబు బెదిరింపులు

Mumbai Bomb Threat: ముంబై విమానాశ్రయానికి, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈమెయిల్ ను దుండగులు నేరుగా పోలీసుల అధికారిక ఈమెయిల్ ఐడీకి పంపారు. ఉగ్రవాది అఫ్జల్ గురు, సాయిబాబు శంకర్ (సైవక్కున్ శంకర్ అని కూడా పిలుస్తారు)లకు అక్రమంగా ఉరిశిక్షను విధించారని మెయిల్ లో పేర్కొన్నారు. ఇందుకు ప్రతిచర్యగా నగరంలోని రెండు ప్రధాన స్థానాలైన ముంబై ఎయిర్ పోర్ట్, తాజ్ హోటల్ పై దాడులు చేస్తామని బెదిరించారు.

 

ఈమెయిల్ అందుకున్న వెంటనే, ముంబై పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. విమానాశ్రయం మరియు హోటల్ ప్రాంగణాన్ని స్కాన్ చేయడానికి బృందాలను మోహరించారు. అయితే, ఇప్పటివరకు, ఎటువంటి అనుమానాస్పదంగా కనుగొనబడలేదు. ఈ మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందన్న విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. అయితే ఎయిర్ పోర్టుతోపాటు, చత్రపతి శివాజి టర్మినల్ లో భద్రతను పెంచారు.

 

తాజాగా పహల్గాం దాడి జరగడం, భారత్ పాక్ పై క్షిపణులను ప్రయోగించడం వంటి చర్యలతో భద్రతా బలగాలు అనుక్షణం అలర్ట్ గా ఉన్నాయి. దేశం వెలుపల, లోపల పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. భారత్ పై ప్రయోగించిన డ్రోన్ లను పాకిస్తాన్ కు టర్కీ సహాయం చేసింది. అయితే భారత్ ను ఎలాగైనా ఓడిస్తామని కలలు కన్న రెండు దేశాలకు చుక్కలు కనిపించాయి.