Last Updated:

Ranbir Kapoor: నటుడు రణబీర్ కపూర్‌కు ఈడీ సమన్లు

: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అక్టోబర్ 6న సమన్లు జారీ చేసింది.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూలాల ప్రకారం, రణబీర్ కపూర్ సబ్సిడరీ యాప్‌ను ప్రమోట్ చేసారు. 

Ranbir Kapoor: నటుడు రణబీర్ కపూర్‌కు ఈడీ సమన్లు

Ranbir Kapoor: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అక్టోబర్ 6న సమన్లు జారీ చేసింది.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూలాల ప్రకారం, రణబీర్ కపూర్ సబ్సిడరీ యాప్‌ను ప్రమోట్ చేసారు.  దీనిని మహాదేవ్ బుక్ యాప్ ప్రమోటర్లు కూడా ప్రమోట్ చేసారు. ప్రమోషన్ కోసం రణబీర్ కపూర్‌ నగదు రూపంలో డబ్బు తీసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.మహదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ యొక్క ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ వివాహానికి రణబీర్ కపూర్ హాజరయినట్లు సమాచారం.

రూ.112 కోట్లు హవాలా ద్వారా డెలివరీ..(Ranbir Kapoor)

ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన మహాదేవ్ బుక్ యాప్‌ను పలు రాష్ట్రాల ఈడీ మరియు పోలీసు విభాగాలు విచారిస్తున్నాయి.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సేకరించిన డిజిటల్ సాక్ష్యాధారాల ప్రకారం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి రూ.112 కోట్లు హవాలా ద్వారా డెలివరీ చేయబడింది, అయితే హోటల్ బుకింగ్‌లకు చెల్లింపు, రూ.42 కోట్లు నగదు రూపంలో జరిగాయని గత నెలలో ఈడీ వర్గాలు వెల్లడించాయి. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో కొనసాగుతున్న విచారణకు సంబంధించి దర్యాప్తు సంస్థ మరికొందరు ప్రముఖ బాలీవుడ్ నటులు మరియు గాయకులను సమన్లు చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో యుఎఇలో జరిగిన మహదేవ్ బుక్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుకకు పలువురు బాలీవుడ్ నటులు, గాయకులు హాజరయ్యారు. వీరిలో టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, విశాల్ దద్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బండా, నుష్రత్ భరుచ్చా, కృష్ణ అభిషేక్ మరియు సుఖ్వీందర్ సింగ్ ఉన్నారు.

మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ యూఏఈలోని సెంట్రల్ హెడ్ ఆఫీస్ నుంచి నడుస్తుందని ఈడీ విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. వారిఅసోసియేట్‌లకు 70-30 శాతం లాభ నిష్పత్తిలో ఫ్రాంఛైజ్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. బెట్టింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆఫ్‌-షోర్ ఖాతాలకు మళ్లించేందుకు పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు జరుగుతున్నాయి. కొత్త వినియోగదారులు మరియు ఫ్రాంచైజీ (ప్యానెల్) అన్వేషకులను ఆకర్షించడానికి బెట్టింగ్ వెబ్‌సైట్‌ల ప్రకటనల కోసం భారతదేశంలో కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. కంపెనీ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందినవారు. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ అప్లికేషన్ అనేది అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్‌లను ప్రారంభించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేసే సిండికేట్.