Home / తెలంగాణ
TSPSC Paper Leak: ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. సిట్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆక్టోబర్ నుంచి ఈ దందా సాగుతున్నట్లు సిట్ అధికారులు తేల్చారు. అయితే మరికొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
MLC Kavitha: ఈడీ విచారణలో భాగంగా.. కవిత దిల్లీ బయల్దేరి వెళ్లారు. దీంతో రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ కవితతో పాటు.. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కూడా వెళ్లారు. దీంతో రేపు ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Revanth Reddy: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణం ప్రభుత్వమేనని ఆరోపిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.
దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వర్మ చేసిన కామెంట్స్ పలువరు రాజకీయ నాయకులు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంత రావు కూడా వర్మ వ్యాఖ్యలను ఖండించారు.
TSPSC Paper Leak: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అంతా తామై వ్యవహరించిన సిస్టమ్ ఎనలిస్ట్ రాజశేఖర్, కార్యదర్శి పీఏ ప్రవీణ్ అక్టోబరు నుంచే ఈ దందా మొదలుపెట్టినట్లు వెల్లడైంది.
KTR Comments: ప్రశ్నపత్రం వ్యవహారంపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. దీని వెనకు ఎవరున్న వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కేవలం ఇద్దరు చేసిన తప్పుల వల్ల.. సంస్థను నిందించటం సరికాదని ఆయన అన్నారు.
Bandi Sanjay: బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ మేరకు రాష్ట్ర మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి.
మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ బోర్డు ఛైర్మన్ జనార్థన్ రెడ్డి తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
Rains: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉండనున్నాయి. రెండు రోజుల క్రితం ఇరు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలతో పాటు.. వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ పేర్కొంది.