Last Updated:

KTR Comments: మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. మరిన్ని సదస్సులు నిర్వహిస్తాం- కేటీఆర్‌

KTR Comments: హైదరాబాద్ లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమలకు ఒకే దగ్గర అత్యుత్తమ వసతులను కల్పిస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

KTR Comments: మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. మరిన్ని సదస్సులు నిర్వహిస్తాం- కేటీఆర్‌

KTR Comments: దేశంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకువెళుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌ కు ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయని ఆయన అన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ సీఐఐ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. (KTR Comments)

హైదరాబాద్ లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమలకు ఒకే దగ్గర అత్యుత్తమ వసతులను కల్పిస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో వ్యాపారులకు, పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని.. అలాంటి వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సంస్థలు హైదరాబాద్‌ లో కేంద్రాలను ఏర్పాటు చేశాయన్నారు. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌ వంటి సంస్థలు అతిపెద్ద క్యాంపస్‌లను నగరంలో ఏర్పాటు చేశాయని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. రానున్న కాలంలో మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని వివరించారు.

2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయని తెలిపారు. 2030 నాటికి 250 బిలియన్‌ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయి. 9 బిలియన్‌ టీకాలు నగరంలో ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే తయారవుతాయి. ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నాం. సుల్తాన్‌పూర్‌ వద్ద అతిపెద్ద మెడికల్‌ డివైజెస్‌ పార్కు ఏర్పాటు చేశాం. లైఫ్‌ సైన్సెస్‌తో పాటు టెక్నాలజీ రంగానికీ హైదరాబాద్‌ అత్యుత్తమ వేదికగా మారింది. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటిగా నగరంలోనే జరిగింది. ప్రైవేటుగా రాకెట్‌ లాంచింగ్‌ చేసిన స్కైరూట్‌ సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తున్నా అని కేటీఆర్‌ అన్నారు.

విదేశీ కంపెనీలకు గమ్యస్థానం

విదేశీ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా ఉందని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం మంత్రి కేటీఆర్‌ విశేష కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రం సాధిస్తున్న వృద్ధి వల్లే పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం బాగుందన్నారు. రాష్ట్రంలో టీఎస్‌ ఐపాస్‌ ద్వారా సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానం బాగుంది. ఆవిష్కరణలను ప్రోత్సహించే టీ హబ్‌ మంచి ఆలోచన. పునరుత్పాదక రంగంలో పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. విదేశీ కంపెనీలకు దక్షిణాది రాష్ట్రాలు గమ్యస్థానంగా ఉన్నాయి అని సుచిత్ర ఎల్ల చెప్పారు.